News February 7, 2025
మరోసారి SA20 ఫైనల్కు సన్రైజర్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738886332483_1045-normal-WIFI.webp)
‘SA20’లో ఎలిమినేటర్లో పార్ల్ రాయల్స్పై గెలిచి సన్రైజర్స్(SEC) ముచ్చటగా మూడోసారి ఫైనల్ చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ 175/4 స్కోరు చేసింది. రూబిన్(81), ప్రిటోరియస్(59) రాణించారు. ఛేజింగ్లో SEC ఓపెనర్ జోర్జీ(78), జోర్డాన్(69) తడబడకుండా ఆడారు. ఫైనల్లో ముంబై ఇండియన్స్ కేప్టైన్(MICT)తో రేపు రాత్రి 9గంటలకు సన్రైజర్స్ తలపడనుంది. మార్క్రమ్ సేన తొలి రెండు సీజన్లు కప్ కొట్టిన సంగతి తెలిసిందే.
Similar News
News February 7, 2025
‘పాలమూరు-రంగారెడ్డి’కి జాతీయ హోదా ఇవ్వలేం: కేంద్రం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738891162968_653-normal-WIFI.webp)
TG: పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పింది. లోక్సభలో కాంగ్రెస్ MP బలరాం నాయక్ అడిగిన ప్రశ్నకు జలశక్తి సహాయమంత్రి రాజ్ భూషణ్ చౌదరి పైవిధంగా సమాధానమిచ్చారు. టెక్నికల్ అంశాలు, న్యాయపరమైన చిక్కులు అడ్డొస్తున్నాయన్నారు. AP, TGలో ఏ ఒక్క ఎత్తిపోతల పథకానికి హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు. దీంతో విభజన చట్టం హామీని కేంద్రం విస్మరించిందని INC మండిపడింది.
News February 7, 2025
రేపటి నుంచి TG ఓపెన్ చెస్ టోర్నీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738891409179_893-normal-WIFI.webp)
TG: రేపు, ఎల్లుండి చర్లపల్లిలో ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు స్టేట్ చెస్ అసోసియేషన్ (TSTA) తెలిపింది. బొడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో అండర్ 7, 9, 11, 13, 15 విభాగాల్లో పోటీలు ఉంటాయని TSTA ప్రెసిడెంట్ KS ప్రసాద్ పేర్కొన్నారు. ఇందులో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుందని, వివరాలకు 7337578899, 7337399299 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
News February 7, 2025
OTTలోకి వచ్చేసిన ‘గేమ్ ఛేంజర్’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738841216459_893-normal-WIFI.webp)
శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 10న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కియారా, అంజలి, SJ సూర్య, జయరాం కీలక పాత్రల్లో నటించారు.