News April 16, 2025

SUPER.. గిన్నిస్ రికార్డు కొట్టిన నాగర్‌కర్నూల్ వాసి 

image

నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ గ్రామ పంచాయతీ పరిధి కంటోనిపల్లి గ్రామానికి చెందిన అయినాల డేనియల్ రాజ్‌కు వరల్డ్ గిన్నిస్ బుక్‌లో చోటు దక్కింది. 2024 డిసెంబర్ 1న 1,046 మంది ఆన్‌లైన్‌లో ఒకేసారి గంట సేపు కీబోర్డు ప్లే ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు. గిన్సిస్ బుక్ నిర్వాహకులు హైదరాబాద్‌లోని మణికొండలో మంగళవారం రాజుకు రికార్డు పత్రాన్ని ప్రదానం చేశారు. 

Similar News

News December 4, 2025

జీవీఎంసీలో విలీనం కానున్న గ్రామీణ మండలాలివే..!

image

ఉమ్మడి విశాఖ జిల్లా విభజన అనంతరం మిగిలిపోయిన 4 మండలాలైన ఆనందపురం, పద్మనాభం, భీమిలి, పెందుర్తిని GVMCలో విలీనం చేసే ప్రక్రియ జరుగుతోంది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని 3 గ్రామీణ మండలాలు (భీమిలి, పద్మనాభం, ఆనందపురం) GVMCలో కలిపేందుకు CM చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, నారాయణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తెలిపారు. దీంతో GVMC పరిధి విస్తరణతో పాటు వార్డులు కూడా పెరగనున్నాయి.

News December 4, 2025

ఏయే పూజలకు ఏ సమయం అనుకూలం?

image

పౌర్ణమి తిథి నేడు ఉదయం 8.37AMకి ప్రారంభమై, రేపు తెల్లవారుజామున 4.43AMకి ముగుస్తుంది. కాబట్టి పౌర్ణమి రోజు చేసే ఏ పూజలైనా, వ్రతాలైనా ఈ సమయంలో చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. నేడు ఉదయం 6.59AM – 2.54PM మధ్యలో రవి యోగం ఉంటుందని, ఈ సమయంలో పవిత్ర స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని అంటున్నారు. లక్ష్మీ, సత్యనారాయణ వ్రతాలతో పాటు శివాభిషేకం, ఇతర పూజలు ప్రదోష కాలంలో చేయాలంటున్నారు.

News December 4, 2025

అమరావతిలో 2వ దశ పూలింగ్.. ప్రభుత్వ భూమి ఎంత ఉందంటే.?

image

అమరావతి రాజధాని నిర్మాణానికి 2వ దశ పూలింగ్‌కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లా నుంచి 7,464 ఎకరాల పట్టా భూమి, 97 ఎకరాల అసైన్డ్ భూమిని పూలింగ్‌కు తీసుకునేందుకు ఉత్తర్వులు జారీ కాగా.. ప్రభుత్వ భూమి మరో 2054.23 ఎకరాల ఉంది. గుంటూరు(D) తుళ్లూరు మండలంలోని మిగిలిన గ్రామాల్లో 9097.56 ఎకరాల పట్టా భూమి, 7.01 అసైన్డ్ భూమి కాగా ప్రభుత్వ భూమి 1774.07 ఏకరాలుగా ఉత్తర్వుల్లో ఉంది.