News April 16, 2025
SUPER.. గిన్నిస్ రికార్డు కొట్టిన నాగర్కర్నూల్ వాసి

నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ గ్రామ పంచాయతీ పరిధి కంటోనిపల్లి గ్రామానికి చెందిన అయినాల డేనియల్ రాజ్కు వరల్డ్ గిన్నిస్ బుక్లో చోటు దక్కింది. 2024 డిసెంబర్ 1న 1,046 మంది ఆన్లైన్లో ఒకేసారి గంట సేపు కీబోర్డు ప్లే ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు. గిన్సిస్ బుక్ నిర్వాహకులు హైదరాబాద్లోని మణికొండలో మంగళవారం రాజుకు రికార్డు పత్రాన్ని ప్రదానం చేశారు.
Similar News
News April 16, 2025
ప్రకాశం: సొంత పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్న మాజీ మంత్రి?

మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ త్రిపురాంతకం ఎంపీపీ, పుల్లలచెరువు వైస్ ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలికారని ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్నారు. వైసీపీకి ఓటు వేసిన ఎంపీటీసీ సృజన సోదరి వసుంధర సురేశ్కు చెందిన జార్జ్ కళాశాలలో లెక్చరర్గా పని చేస్తున్నారు. దీంతో ఆమెను విధుల నుంచి తప్పించారని టాక్. తాటిపత్రికి చెక్ వేయాలని చూడగా వైవీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
News April 16, 2025
పవన్ భార్యపై ట్రోల్స్.. విజయశాంతి ఫైర్!

శ్రీవారికి తలనీలాలు సమర్పించిన AP DyCM పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవాపై ట్రోలింగ్ చేయడం సరికాదని TG MLC విజయశాంతి మండిపడ్డారు. ‘విదేశాల నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన అన్నా లెజినోవాపై కామెంట్స్, ట్రోలింగ్ చేయడం అత్యంత అసమంజసం. తన కుమారుడు అగ్ని ప్రమాదం నుంచి బయటపడినందుకు కృతజ్ఞతగా శ్రీవారికి తలనీలాలిచ్చారు. ఇలా ట్రోల్ చేయడం తప్పు’ అని ట్వీట్ చేశారు.
News April 16, 2025
కైలాసపట్నం: క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమం

కోటవురట్ల మండలం కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కేజీహెచ్ సీఎస్ఆర్ బ్లాక్లో చికిత్స పొందుతున్న జల్లూరి నాగరాజు, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మడకల జానకిరామ్కు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని వారి బంధువులు మంగళవారం తెలిపారు. వి.సంతోషి, వి షారోని, వి.రాజును త్వరలో డిశ్చార్జ్ చేయనున్నారు.