News November 5, 2024
SUPER: 150కి 150 మార్కులు

AP: టెట్ ఫలితాల్లో పలువురు పేదింటి విద్యార్థులు సత్తా చాటారు. 150కి 150 మార్కులు సాధించి అదరగొట్టారు. విజయనగరానికి చెందిన కొండ్రు అశ్విని, నంద్యాల(D) గొర్విమానుపల్లె వాసి మంజుల, నిచ్చెనమెట్లకు చెందిన క్రాంతికుమార్ వంద శాతం మార్కులు సాధించారు. వీరి తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నారు. టీచర్ ఉద్యోగం సాధించి పేద విద్యార్థులకు ఉత్తమ బోధన అందించడమే లక్ష్యమని వారు వెల్లడించారు.
Similar News
News February 1, 2026
సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

CSIR-సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (<
News February 1, 2026
‘గీతం’ వర్సిటీపై జగన్ దుష్ప్రచారం: MP భరత్

AP: విశాఖలోని ‘గీతం’ వర్సిటీపై YCP చీఫ్ జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని సంస్థ ప్రెసిడెంటు, MP భరత్ విమర్శించారు. ‘గత GOVTలో వర్సిటీ ప్రహరీని అక్రమంగా కూలగొట్టారు. 2024లోని ధరల ప్రకారం 54.79 ఎకరాల విలువ 1000CR. ఏడాదిలో 5 రెట్లు పెరిగిందనడం సరికాదు. ప్రభుత్వం నిర్ణయించే ధరను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడే 1100 CR విలువైన 11 ఎకరాలను TSIBకి మీ ప్రభుత్వం 11CRకే ఎలా ఇచ్చింది?’ అని ప్రశ్నించారు.
News February 1, 2026
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

బడ్జెట్ నేపథ్యంలో ఒడుదొడుకులకు లోనైన స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1546 పాయింట్ల నష్టంతో 80,722కు చేరగా నిఫ్టీ 495 పాయింట్లు కోల్పోయి 24,825 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్లో TCS, ఇన్ఫోసిస్, సన్ఫార్మా, టైటాన్ మినహా మిగతా షేర్లు అన్ని నష్టాలతోనే ముగిశాయి. F&Oకు సంబంధించిన సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ ట్యాక్స్ పెంచడం మార్కెట్లపై ప్రభావం చూపింది.


