News October 15, 2024
మహా స్పీడ్గా సంతకాలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు గంటల ముందు పాలకపక్షం వేగంగా పెండింగ్ సంతకాలు క్లియర్ చేస్తోంది. తమ శాఖల్లోని దస్త్రాలకు ఆమోద ముద్రలు వేసే పనిలో మంత్రులు బిజీగా ఉన్నారు. అటు రెండ్రోజులుగా చాలా పనులకు క్లియరెన్స్ ఇస్తున్నట్లు మంత్రాలయ సమాచారం. మరోవైపు ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న 12 MLC పోస్టుల్లో గవర్నర్ రాధాకృష్ణన్ గత రాత్రి ఏడుగురిని నామినేట్ చేశారు. కాసేపట్లో వీరు ప్రమాణం చేయనున్నారు.
Similar News
News January 1, 2026
చెడు శకునాలు ఎదురైతే?

చెడు శకునాలు ఎదురైనా, అశుభ సంకేతాలు కనిపించినా కొన్ని మార్గాలతో దోష నివారణ చేసుకోవచ్చు. ‘పసుపు కలిపిన గంగాజలంతో ఇంటిని శుద్ధి చేయాలి. ఇష్టదైవాన్ని స్మరిస్తూ విభూతి, తులసి తీర్థం చల్లాలి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. విజ్ఞులు, బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. దానధర్మాల వల్ల ఆపదల తీవ్రత తగ్గుతుంది. శకునాలు హెచ్చరికలు మాత్రమేనని, సత్కర్మలు, దైవ ప్రార్థన ద్వారా కష్టాలను దాటొచ్చని పండితులు చెబుతున్నారు.
News January 1, 2026
ఈనెలలోనే అందుబాటులోకి వందేభారత్ స్లీపర్: కేంద్ర మంత్రి

వందేభారత్ స్లీపర్ రైలు జనవరిలో అందుబాటులోకి తెస్తున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. గువాహటి-కోల్కతా రూట్లో తొలి రైలు పరుగులు పెడుతుందని తెలిపారు. 3 టైర్ కోచ్లు 11, 2 టైర్ 4, ఫస్ట్ AC కోచ్ 1 ఉంటుందని మొత్తం 823 పాసింజర్లు ప్రయాణించవచ్చని చెప్పారు. వచ్చే 6 నెలల్లో మరో 8, ఏడాది చివరికి 12 ట్రైన్లు అందుబాటులోకి తెస్తామన్నారు. 15-20 రోజుల్లో సర్వీసులు స్టార్ట్ అవుతాయని చెప్పారు.
News January 1, 2026
మీ త్యాగం వల్లే ఈ సెలబ్రేషన్స్.. సెల్యూట్❤️

లోకమంతా న్యూఇయర్ వేడుకల్లో మునిగి తేలుతున్న వేళ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత. మనం ఇక్కడ మిత్రులతో విందులు, వినోదాలతో ఎంజాయ్ చేస్తుంటే.. గడ్డకట్టే హిమపాతంలో కుటుంబానికి దూరంగా సైనికులు దేశం కోసం పహారా కాస్తున్నారు. వారు చేస్తున్న సేవ, త్యాగం వల్లే మనం సురక్షితంగా వేడుకలు జరుపుకోగలుగుతున్నాం. ఆ వీర జవాన్లందరికీ మనస్ఫూర్తిగా సెల్యూట్ చేద్దాం.


