News October 11, 2024
నమ్కిన్ ప్యాకెట్ల మాటున రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా

ఢిల్లీలో మరోసారి ₹వేల కోట్లు విలువ చేసే డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. తాజాగా నమ్కిన్ ప్యాకెట్ల మాటున సరఫరా చేస్తున్న ₹2 వేల కోట్లు విలువచేసే 200 కేజీల కొకైన్ను పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల ఢిల్లీలో పట్టుబడిన ₹5,620 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా ముఠాకు తాజాగా ఘటనతో సంబంధాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నలుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు లండన్ పరారైనట్టు తెలుస్తోంది.
Similar News
News January 21, 2026
వారన్ బఫెట్ బెస్ట్ డెట్ రూల్స్

– సేవింగ్స్ కంటే, మీ రుణాల్లో అధిక వడ్డీవి క్లియర్ చేయడం ముఖ్యం.
– ఫైనాన్షియల్ ఫ్రీడమ్ భ్రమలో క్రెడిట్ కార్డ్స్ వాడవద్దు
– పరిమితంగా, పరిమితుల్లో జీవించడం అలవర్చుకోవాలి
– లాంగ్ టర్మ్ స్టెబిలిటీ, ఫోకస్తోనే పెట్టుబడులు ఉండాలి
– ఏది కొనాలి అన్పించినా.. నాకు ఇది తప్పక అవసరమా? అని ప్రశ్నించుకోవాలి
– స్కిల్స్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్పై ఖర్చును పెట్టుబడిగా భావించి ప్రాధాన్యమివ్వాలి
News January 21, 2026
కొనసాగిన నష్టాలు

స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాల వైపే మొగ్గు చూపారు. ఒకానొక దశలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల నష్టాల్లోకి వెళ్లింది. మధ్యాహ్నం తర్వాత కాస్త పుంజుకొని చివరికి 270 పాయింట్ల నష్టంతో 81,909 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి 25,157 వద్ద సెటిల్ అయింది.
News January 21, 2026
అమరావతికి చట్టబద్ధత.. పార్లమెంటులో బిల్లు!

AP రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. క్యాబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించాలంటూ కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. రాజధాని ఎంపిక ప్రక్రియ, నిర్మాణాలపైనా నోట్ ఇచ్చింది. కాగా ఏ తేదీ నుంచి రాజధానిగా గుర్తించాలో చెప్పాలని కేంద్రం కోరినట్లు సమాచారం.


