News October 27, 2025
పత్తి తేమ 12% దాటితే మద్దతు ధర రాకపోవచ్చు: తుమ్మల

TG: పత్తి అమ్మకాల విషయంలో రైతులు నాణ్యత, తేమ శాతాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తి తేమ 12% మించకుండా చూసుకోవాలన్నారు. 12శాతం మించితే కనీస మద్దతు ధర పొందే అవకాశం ఉండదని తెలిపారు. గరిష్ఠ మద్దతు ధర అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ విషయమై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు.
Similar News
News October 27, 2025
దేశంలోనే మొట్టమొదటి మహిళా అశ్విక దళం

హైదరాబాద్ పోలీసులు దేశంలోనే మొట్టమొదటి మహిళా అశ్విక దళాన్ని ఏర్పాటు చేశారు. గుర్రపుస్వారీలో శిక్షణపొంది, మెరికల్లా తయారై సిటీమౌంటెడ్ పోలీస్ విభాగంలో భాగమయ్యారు 9మంది మహిళా కానిస్టేబుళ్లు. వీరంతా 2024 ఆర్డ్మ్ రిజర్వ్ బ్యాచ్కి చెందిన వాళ్లు. వీరికి గుర్రపుస్వారీలో 6నెలల పాటు శిక్షణ ఇప్పించి విధులను అప్పగించారు. మంచి శిక్షణ ఇస్తే తామూ ఎందులోనూ తీసిపోమని ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారీ నారీమణులు.
News October 27, 2025
పోలింగ్లో పైచేయి… అయినా గెలిచేది తక్కువే…

BIHAR ఎన్నికల్లో పురుషుల కన్నా మహిళల ఓటింగ్ శాతమే ఎక్కువ. అయితేనేం పోటీలో ఉండే స్త్రీలు గెలిచేది మాత్రం చాలా స్వల్పం. అంటే వారి ఓట్లు పురుష అభ్యర్థులకే ఎక్కువ పడుతున్నాయన్న మాట. స్త్రీకి స్త్రీయే శత్రువంటే ఇదేనేమో. 2005లో 24(234మందికి), 2010లో 34(307), 2020లో 26(370) మంది మాత్రమే గెలిచారు. 2020లో పోలింగ్ శాతం ఉమెన్ 59.69%, మెన్ 54.45%గా ఉంది. 2015లో అత్యధికంగా 60.48% స్త్రీల ఓట్లు పోలయ్యాయి.
News October 27, 2025
కాఫీ పొడితో కళకళలాడే ముఖం

కాఫీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలుంటాయన్న విషయం తెలిసిందే. అయితే కాఫీపొడి చర్మసంరక్షణలోనూ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. కాఫీపొడి ఫేస్ ప్యాక్లతో ముఖంపై ఉండే మొటిమలు, ముడతలు, మచ్చలు తొలగిపోయి చర్మం కాంతిమంతంగా మారుతుంది. * స్పూన్ కాఫీపొడిలో కాస్త తేనె కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. పావుగంట తర్వాత క్లీన్ చేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. ✍️మరిన్ని బ్యూటీటిప్స్ కోసం <<-se_10014>>వసుధ<<>> కేటగిరీకి వెళ్లండి.


