News June 28, 2024
అదరగొడుతున్న భారత బౌలర్లు: ఇంగ్లండ్ 49/5

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్తో మ్యాచ్లో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. టీమ్ ఇండియా బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ 49 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. సాల్ట్ (5), బట్లర్ (23), అలీ (8), బెయిర్స్టో (0), కరన్ (2) తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. అక్షర్ పటేల్ 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ నడ్డి విరిచారు. బుమ్రా, కుల్దీప్ చెరో వికెట్ పడగొట్టారు.
Similar News
News November 24, 2025
మహిళల కోసం ఎన్నో పథకాలు: రేవంత్

TG: ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతికేలా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని CM రేవంత్ కొడంగల్ సభలో తెలిపారు. ‘సన్నబియ్యం ఇస్తున్నాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. వారిని ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశాం. సోలార్ ప్లాంట్స్ నిర్వహణ అప్పగించాం. శిల్పారామంలో ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశాం’ అని వివరించారు.
News November 24, 2025
UCIL 107 ఉద్యోగాలకు నోటిఫికేషన్

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<
News November 24, 2025
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రూ.304 కోట్లు జమ

TG: రాష్ట్ర ప్రభుత్వం రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసింది. 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో ఈ నగదు జమ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో డీఆర్డీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.


