News August 2, 2024
ఎలక్టోరల్ బాండ్లపై విచారణకు సుప్రీం కోర్టు ‘నో’

ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్పై విచారణ కోసం SIT ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఇందులో ప్రభుత్వాలు-ప్రైవేటు కంపెనీల మధ్య క్విడ్ ప్రో కో(ఇచ్చి పుచ్చుకోవడం) జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పథకంలో భాగంగా దేశంలోని పలు పార్టీలకు ప్రైవేటు సంస్థలు భారీగా విరాళాలు ఇచ్చిన విషయం వెలుగులోకి రావడంతో ఈ ఆరోపణలు మొదలయ్యాయి.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


