News February 20, 2025
హైకోర్టు జడ్జీలపై లోక్పాల్ విచారణ ఆదేశాలను నిలిపివేసిన సుప్రీంకోర్టు

లోక్పాల్, లోకాయుక్త చట్టాల కింద హైకోర్టు జడ్జీలపై విచారణకు ఆదేశించడాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఆ ఆదేశాలు తమను తీవ్రంగా కలచివేశాయని పేర్కొంది. ఇద్దరు హైకోర్టు జడ్జీలపై Jan 27న లోక్పాల్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సుమోటోగా తీసుకొని విచారించింది. హైకోర్టు జడ్జీలు లోక్పాల్ పరిధిలోకి రారని, చట్టంలో తప్పుగా నిర్వచించారని కేంద్రం తరఫున వాదించిన SG తుషార్ మెహతా సైతం పేర్కొనడం గమనార్హం.
Similar News
News January 1, 2026
చేపల్లో శంకుపూత వ్యాధి – నివారణకు సూచనలు

తెల్ల చేపల్లో శంకుపూత వ్యాధి శీతాకాలంలో వస్తుంది. దీని వల్ల చేపల ఎదుగుదల లోపిస్తోంది. దీని నివారణకు ఎకరా చేపల చెరువులో 80-100 kgల ఉప్పును చల్లాలని మత్స్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. వ్యాధి ఉద్ధృతి ఎక్కువగా ఉంటే ఎకరా చేపల చెరువుకు కాపర్ సల్ఫేట్ ఒక KG చల్లాలి. చేపల పెరుగుదల బాగుండాలంటే ఎకరాకు పిల్లల మోతాదు 3 వేలకు మించకూడదు. 100KGల తవుడుకు 30-40KGల చెక్క కలిపి మేతగా ఇస్తే చేపల పెరుగుదల బాగుంటుంది.
News January 1, 2026
Stock Market: కొత్త ఏడాదికి లాభాలతో స్వాగతం

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త సంవత్సరాన్ని లాభాలతో ప్రారంభించాయి. నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 26,183 వద్ద.. సెన్సెక్స్ 170 పాయింట్లు పెరిగి 85,391 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో M&M, ఎటర్నల్, రిలయన్స్, L&T, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో.. ITC, BEL, బజాజ్ ఫైనాన్స్, సన్ఫార్మా, ట్రెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News January 1, 2026
నల్ల నువ్వులతో గ్రహ దోషాలు దూరం: పండితులు

గ్రహ దోషాల వల్ల కలిగే శత్రు బాధలు, ఆటంకాల నుంచి ఉపశమనానికి నల్ల నువ్వులు దివ్యౌషధంలా పనిచేస్తాయి. శనివారం సాయంత్రం నువ్వుల నూనెలో నల్ల నువ్వులు వేసి దీపారాధన చేయడం, పేదలకు నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. అలాగే అమావాస్య రోజున పితృ దేవతలకు తిల తర్పణం వదిలితే వారి ఆశీస్సులు లభించి కష్టాలు తొలగిపోతాయి. భక్తితో పాటు మంచి ప్రవర్తన ఉంటే ఈ పరిహారాలు శీఘ్ర ఫలితాలనిస్తాయి.


