News April 5, 2024

యూపీ మదర్సాల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

image

యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్-2004 రాజ్యాంగ విరుద్ధమంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మదర్సా బోర్డు ఏర్పాటు సెక్యులరిజం సూత్రాలను ఉల్లంఘిస్తోందని హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదని పేర్కొంది. మార్చి 22న హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మదర్సాల్లో కార్యకలాపాలను మళ్లీ చేపట్టవచ్చని స్పష్టం చేసింది.

Similar News

News December 1, 2025

పెద్దపల్లి: ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

image

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సిరి ఫంక్షన్ హాల్ వరకు ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డా.వి.వాణిశ్రీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో డ్రగ్స్ వినియోగం, అసురక్షిత లైంగిక చర్యలు, వాడిన సిరంజిల వల్ల ఎచ్‌.ఐ.వి. వ్యాప్తి ప్రమాదం పెరుగుతోందని ఆమె చెప్పారు. యువతలో అవగాహన పెంపు అత్యవసరమని సూచించారు.

News December 1, 2025

ఇతిహాసాలు క్విజ్ – 83 సమాధానాలు

image

నేటి ప్రశ్న: శివారాధనకు సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అందుకు కారణమేంటి?
సమాధానం: సోమవారానికి సోముడు అధిపతి. సోముడంటే చంద్రుడే. ఆ చంద్రుడిని శివుడు తన తలపై ధరిస్తాడు. అలా సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైనదిగా మారింది. జ్యోతిషం ప్రకారం.. సోమవారం రోజున శివుడిని పూజిస్తే చంద్రుడి ద్వారా కలిగే దోషాలు తొలగి, మానసిక ప్రశాంతత, అదృష్టం లభిస్తాయని నమ్మకం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 1, 2025

వ్యవసాయం కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న CBN: జగన్

image

AP: వ్యవసాయం కుప్పకూలిపోతుంటే CM CBN రైతులను వారి విధికి వదిలేసి చోద్యం చూస్తున్నారని YCP చీఫ్ YS జగన్ మండిపడ్డారు. ‘హలో ఇండియా! AP వైపు చూడండి. అక్కడ KG అరటి ₹0.50 మాత్రమే. ఇది నిజం. రైతుల దుస్థితికిది నిదర్శనం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. మా హయాంలో టన్ను అరటికి 25వేలు ఇచ్చాం. రైతులు నష్టపోకుండా ఢిల్లీకి రైళ్లు ఏర్పాటుచేశాం. కోల్డ్ స్టోరేజీలు పెట్టాం’ అని Xలో పేర్కొన్నారు.