News July 19, 2024
గవర్నర్లకు నేర విచారణ నుంచి రక్షణపై.. సుప్రీం కీలక నిర్ణయం

బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాధితురాలి పిటిషన్ మేరకు నేర విచారణ నుంచి గవర్నర్కు మినహాయింపునిచ్చే ఆర్టికల్ 361 నిబంధనను పరిశీలించేందుకు అంగీకరించింది. దీని కింద రాష్ట్రపతి/గవర్నర్ తన పవర్స్, విధుల విషయంలో ఎవరికీ జవాబుదారీగా ఉండరు. కాగా గవర్నర్ ఆనంద బోస్ లైంగికంగా వేధించారంటూ అక్కడి రాజ్భవన్లో పని చేసే ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News November 20, 2025
సతీ సావిత్రి తన భర్త ప్రాణాలను ఎలా కాపాడుకుందో తెలుసా?

సావిత్రి తన వాక్చాతుర్యంతో భర్త సత్యవంతుడి ప్రాణాలను కాపాడుకుంది. యముడు తన భర్త ప్రాణాలను తీసుకొని వెళ్తుంటే అడ్డుపడింది. ధర్మబద్ధమైన సంభాషణలతో యముడిని మెప్పించి, 3 వరాలు పొందింది. మూడో వరంగా సత్యవంతుడి ద్వారా 100 మంది పుత్రులు కావాలని కోరింది. యముడు వరమివ్వగానే ‘నా భర్త మీ వెంట ఉంటే, నాకు పుత్రులు ఎలా కలుగుతారు?’ అని ప్రశ్నించింది. భర్త ప్రాణాలు తీయడానికి వచ్చిన యముడి చేతే భర్తను బతికించుకుంది.
News November 20, 2025
ఈ అలవాట్లతో రోగాలకు దూరం: వైద్యులు

ఆరోగ్య సమస్యలను డైలీ హ్యాబిట్స్ ద్వారా దూరం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ‘రోజుకు 10వేల అడుగులు నడిస్తే శారీరక & మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. మెడిటేషన్ చేస్తే ఒత్తిడి & ఆందోళన తగ్గుతుంది. ఒకే సమయానికి నిద్ర పోవడం & మేల్కోవడం చేయాలి. సూర్యరశ్మి తగిలితే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ప్రాసెస్ చేసిన ఫుడ్ను తినకపోవడం బెస్ట్. బ్యాలెన్స్ డైట్ తీసుకోండి’ అని సూచిస్తున్నారు.
News November 20, 2025
పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు రాష్ట్రపతికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. రాత్రికి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఆమె బస చేయనున్నారు. రేపు ఉదయం రాష్ట్రపతి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుపతి పర్యటన ముగిసిన తర్వాత హైదరాబాద్కు బయల్దేరి వెళ్లనున్నారు.


