News October 3, 2024

లడ్డూ వివాదంపై నేడు సుప్రీం విచారణ.. సర్వత్రా ఉత్కంఠ

image

AP: తిరుమల లడ్డూ వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టు మరోసారి విచారించనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌ను కొనసాగించాలా?లేదా స్వతంత్ర సంస్థను నియమించాలా? అనే అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ తన అభిప్రాయాన్ని ధర్మాసనానికి చెప్పనున్నారు. దీన్నిబట్టి న్యాయమూర్తులు తీర్పును వెలువరించనున్నారు. గత విచారణలో సీఎం చంద్రబాబుపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Similar News

News November 23, 2025

భూపాలపల్లి జిల్లాలో శనివారం ముచ్చట్లు

image

✓ భూపాలపల్లి DCC అధ్యక్షుడిగా  భట్టు కర్ణాకర్

✓ భూపాలపల్లి: టెన్త్‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్

✓ మృతదేహంతో కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగిన తోటి కార్మికులు

✓ భూపాలపల్లి ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణులకు ఒకటే బెడ్

✓ కాళేశ్వరం లో భక్తుల సందడి

✓ చిన్న కాళేశ్వరం పనులపై కలెక్టర్ సమీక్ష

✓ వే 2న్యూస్ కథనానికి స్పందించి గుంతలు పూడ్చిన అధికారులు

News November 22, 2025

టెర్రర్ మాడ్యూల్.. మరో కీలక నిందితుడి అరెస్ట్

image

ఢిల్లీ పేలుడు-టెర్రర్ మాడ్యూల్ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. పుల్వామాలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే తుఫైల్ అహ్మద్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరో కీలక నిందితుడు డా.ముజఫర్ ఆగస్టులోనే దేశం విడిచి వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతడు అఫ్గాన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అరెస్టైన డాక్టర్లకు, జైషే మహ్మద్ హ్యాండర్లకు అతడే మధ్యవర్తిత్వం వహించినట్లు భావిస్తున్నారు.

News November 22, 2025

అప్పుగా తెచ్చిన ₹2.30L కోట్లు ఏమయ్యాయ్: KTR

image

TG: అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్న CM క్షమాపణలు చెప్పాలని KTR డిమాండ్ చేశారు. నెలకు ₹2300 CR కూడా లేని వడ్డీని ₹7వేల కోట్లుగా అబద్ధాలు చెబుతున్నట్లు ‘కాగ్’ నివేదిక బట్టబయలు చేసిందని చెప్పారు. BRS పదేళ్లలో ₹2.8L కోట్ల రుణం తెస్తే కాంగ్రెస్ 23నెలల్లోనే ₹2.30L కోట్లు అప్పు చేసిందని దుయ్యబట్టారు. కొత్త ప్రాజెక్టులు నిర్మించలేదని, అప్పు తెచ్చిన రూ.లక్షల కోట్లు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు.