News December 2, 2024
జగన్ ఆస్తుల కేసులపై సుప్రీం కీలక ఆదేశం

ఏపీ మాజీ CM జగన్ ఆస్తులపై ఉన్న కేసులకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్లతో పాటు తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్లను వివరించాలంది. సీబీఐ, ఈడీ కేసుల వివరాలు చార్ట్ రూపంలో అందించాలని ధర్మాసనం తెలిపింది. అన్ని వివరాలతో అఫిడవిట్లు 2 వారాల్లో దాఖలు చేయాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఆదేశించింది.
Similar News
News October 24, 2025
పవర్గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

పవర్గ్రిడ్ కార్పొరేషన్లో 7 ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. LLB/LLM ఉత్తీర్ణులైనవారు నవంబర్ 14 నుంచి డిసెంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500. CLAT-2026లో అర్హత, డాక్యుమెంట్ వెరిఫికేషన్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
News October 24, 2025
కాసేపట్లో భారీ వర్షం..

TG: రాబోయే 2 గంటల్లో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆ తర్వాత సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట్, రంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో వానలు పడతాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు కురుస్తాయన్నారు.
News October 24, 2025
భారత తొలి మహిళా వార్ జర్నలిస్ట్ ప్రభాదత్

అనేక పురుషాధిక్య రంగాల్లో ప్రస్తుతం మహిళలు కూడా సత్తా చాటుతున్నారు. కానీ 1965లో ఒక మహిళ యుద్ధక్షేత్రంలోకి దిగి ఇండియా-పాకిస్తాన్ యుద్ధాన్ని రిపోర్ట్ చేసిందంటే నమ్మగలరా.. ఆమే భారతదేశపు తొలి మహిళా వార్ జర్నలిస్ట్ ప్రభాదత్. ఆమె ఏం చేసినా సెన్సేషనే. ఎన్నో స్కాములను ఆమె బయటపెట్టారు. ఎన్నో బెదిరింపులు, భౌతిక దాడులను ఎదుర్కొన్నా వెనుకడుగు వేయలేదు. అందుకే ఆమెను చమేలీ దేవీ జైన్ అవార్డ్ వరించింది.


