News December 2, 2024

జగన్ ఆస్తుల కేసులపై సుప్రీం కీలక ఆదేశం

image

ఏపీ మాజీ CM జగన్ ఆస్తులపై ఉన్న కేసులకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్లతో పాటు తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్లను వివరించాలంది. సీబీఐ, ఈడీ కేసుల వివరాలు చార్ట్ రూపంలో అందించాలని ధర్మాసనం తెలిపింది. అన్ని వివరాలతో అఫిడవిట్లు 2 వారాల్లో దాఖలు చేయాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఆదేశించింది.

Similar News

News January 20, 2026

ఒక్క రోజే రూ.12,000 పెరిగిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వెండి, బంగారం ధరలు భారీగా పెరిగాయి. కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ.12,000 పెరిగి రూ.3,30,000కు చేరింది. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,040 పెరిగి రూ.1,47,280కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.950 ఎగబాకి రూ.1,35,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News January 20, 2026

3 నెలల ముందుగానే వచ్చేశాయ్!

image

TG: సాధారణంగా ఏప్రిల్‌లో మార్కెట్లోకి వచ్చే మామిడిపండ్లు ఈసారి 3 నెలల ముందుగానే వచ్చేశాయి. హైదరాబాద్ ఎర్రగడ్డ, ఎంజే, గడ్డి అన్నారం తదితర మార్కెట్లలో బంగినపల్లి రకం కేజీ రూ.200 వరకు విక్రయిస్తున్నారు. చప్పగా, పుల్లగా ఉండటంతో మామిడి కొనేందుకు చాలా మంది ఇష్టపడట్లేదని వ్యాపారులు చెబుతున్నారు. హైబ్రిడ్ సాగు విధానాలు, వాతావరణ మార్పులు, అకాల వర్షాలతో మామిడి ముందుగానే వస్తోందని పేర్కొన్నారు.

News January 20, 2026

కొనసాగుతున్న టారిఫ్‌ల ఎఫెక్ట్.. నష్టాల్లో మార్కెట్లు

image

ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం స్టాక్ మార్కెట్లపై ఇంకా కొనసాగుతోంది. సెన్సెక్స్ 270 పాయింట్లు నష్టపోయి 82,975 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 76 పాయింట్లు కుంగి 25,509 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో SBI, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా, NTPC షేర్లు లాభాల్లో.. ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, ఇండిగో షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.93 వద్ద ప్రారంభమైంది.