News March 19, 2024
శరద్ పవార్ వర్గానికి సుప్రీం కీలక ఆదేశాలు

లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో శరద్ పవార్ వర్గానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఎన్సీపీ-శరద్ చంద్ర పవార్’ అనే పార్టీ పేరును, ‘బాకా ఊదుతోన్న వ్యక్తి’ గుర్తును ఉపయోగించేందుకు అనుమతించింది. వీటిని గుర్తించాలని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్లను ఆదేశించింది. ఈ పేరు, గుర్తును ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు వాడొద్దని సూచించింది.
Similar News
News December 1, 2025
సూర్యాపేట: అత్యధిక ఓటర్లున్న గ్రామ పంచాయతీలు ఇవే

జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల సంఖ్య ఆధారంగా టాప్-10 గ్రామాల జాబితా వెలువడింది. మేళ్లచెరువు గ్రామం 10,567 ఓట్లతో మొదటి స్థానంలో నిలిచి జిల్లాలోనే అతిపెద్ద గ్రామంగా రికార్డు సృష్టించింది. తర్వాతి స్థానాల్లో దొండపాడు (6,737), బేతవోలు (6,468), మఠంపల్లి (6,317), చిలుకూరు (6,041) ఉన్నాయి. మిగతా ఐదు గ్రామాల్లో తుంగతుర్తి, మునగాల, పొనుగోడు, రామాపురం, నూతనకల్ ఉన్నాయి.
News December 1, 2025
ఇతిహాసాలు క్విజ్ – 83 సమాధానాలు

నేటి ప్రశ్న: శివారాధనకు సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అందుకు కారణమేంటి?
సమాధానం: సోమవారానికి సోముడు అధిపతి. సోముడంటే చంద్రుడే. ఆ చంద్రుడిని శివుడు తన తలపై ధరిస్తాడు. అలా సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైనదిగా మారింది. జ్యోతిషం ప్రకారం.. సోమవారం రోజున శివుడిని పూజిస్తే చంద్రుడి ద్వారా కలిగే దోషాలు తొలగి, మానసిక ప్రశాంతత, అదృష్టం లభిస్తాయని నమ్మకం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 1, 2025
వ్యవసాయం కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న CBN: జగన్

AP: వ్యవసాయం కుప్పకూలిపోతుంటే CM CBN రైతులను వారి విధికి వదిలేసి చోద్యం చూస్తున్నారని YCP చీఫ్ YS జగన్ మండిపడ్డారు. ‘హలో ఇండియా! AP వైపు చూడండి. అక్కడ KG అరటి ₹0.50 మాత్రమే. ఇది నిజం. రైతుల దుస్థితికిది నిదర్శనం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. మా హయాంలో టన్ను అరటికి 25వేలు ఇచ్చాం. రైతులు నష్టపోకుండా ఢిల్లీకి రైళ్లు ఏర్పాటుచేశాం. కోల్డ్ స్టోరేజీలు పెట్టాం’ అని Xలో పేర్కొన్నారు.


