News August 23, 2025

అధికారికంగా సురవరం అంత్యక్రియలు: రేవంత్

image

TG: కమ్యూనిస్టు దిగ్గజం, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని CM రేవంత్ ఆదేశించారు. ఈ మేరకు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని CSకు ఆయన సూచించారు. కాగా రేపు మ.3 గంటల వరకు హిమాయత్‌నగర్‌లోని మగ్దూం భవన్‌లో భౌతికకాయాన్ని ఉంచి, ఆ తర్వాత గాంధీ కాలేజీకి అప్పగిస్తారు. భౌతికకాయం అప్పగించే ముందు పోలీసులు అధికార లాంఛనాలతో గౌరవ వందనం సమర్పిస్తారు.

Similar News

News August 23, 2025

పారిశుద్ధ్య కార్మికులకు రూ.కోటి బీమా

image

AP: మున్సిపల్ కార్మికుల భద్రతకు సీఎం చంద్రబాబు కొత్త ఆరోగ్య బీమాను ప్రారంభించారు. పట్టణాభివృద్ధి శాఖ-యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా దీనిని అమలు చేయనున్నాయి. శాశ్వత ఉద్యోగులకు రూ.1 కోటి వరకు ప్రమాద బీమా, రూ.10 లక్షల లైఫ్ కవర్, అవుట్‌ సోర్సింగ్ వారికి రూ.20 లక్షల ప్రమాద బీమా, రూ.2 లక్షల లైఫ్ కవర్ ఉంటుంది. తక్కువ ప్రీమియంతో కుటుంబ సభ్యులతో కలిపి మొత్తంగా రూ.33 లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తిస్తుంది.

News August 23, 2025

‘ఓట్ చోరీ’పై ప్రజల్లోకి కాంగ్రెస్

image

TG: రాహుల్‌ గాంధీకి మద్దతుగా ‘ఓట్ చోరీ’ అంశంపై రాష్ట్రంలోనూ విస్తృత ప్రచారం నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు పీఏసీ సమావేశంలో ప్రచార లోగోను ఆవిష్కరించారు. ఓట్ చోరీపై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు నేతలు పిలుపునిచ్చారు. అటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బాధ్యత ఇన్‌ఛార్జ్ మంత్రిదేనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని సూచించారు.

News August 23, 2025

పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు: కాంగ్రెస్ నిర్ణయం

image

TG: స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇవ్వాలని CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన PAC సమావేశంలో కాంగ్రెస్ నిర్ణయించింది. రిజర్వేషన్ల ఫైల్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ పరంగానే రిజర్వేషన్లు ఇవ్వాలని డిసైడ్ అయింది. SEP 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని HC గడువు విధించడంతో ప్రభుత్వం త్వరలోనే సర్పంచ్ ఎన్నికలపై ప్రకటన చేసే అవకాశముంది.