News December 8, 2024
అక్కినేని కుటుంబంపై సురేఖ వ్యాఖ్యలు తప్పే: టీపీసీసీ చీఫ్

TG: కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత అంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయని మండిపడ్డారు. అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు తప్పని ఆయన అన్నారు. వెంటనే ఆమె సారీ చెప్పినట్లు గుర్తుచేశారు. ఆవిడపై సోషల్మీడియాలో జరిగిన ప్రచారమే దీనికి కారణమైందని, ఈ విషయంలో తాను చొరవ తీసుకోవడంతో వివాదం కాస్త సద్దుమణిగిందని పేర్కొన్నారు.
Similar News
News November 16, 2025
పొద్దుతిరుగుడు సాగు – విత్తన శుద్ధితో మేలు

ఏ పంటకైనా చీడపీడల ముప్పు తగ్గాలంటే విత్తే ముందు విత్తనశుద్ధి తప్పకుండా చేయాలి. పొద్దుతిరుగుడు పంటకు నెక్రోసిస్ వైరస్ తెగులు సమస్యను అధిగమించడానికి కిలో విత్తనానికి 3 గ్రా. థయోమిథాక్సామ్ లేదా 5ml ఇమిడాక్లోప్రిడ్తో విత్తనశుద్ధి చేయాలి. అలాగే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2 గ్రా. ఇప్రోడియాన్ 25%+కార్బండాజిమ్ 25%తో విత్తనశుద్ధి చేసుకుంటే మంచిది.
News November 16, 2025
లంచ్: 10కే 2 వికెట్లు డౌన్

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో టీమ్ ఇండియా తడబడుతోంది. లంచ్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 10 రన్స్ చేసింది. భారత్ విజయానికి మరో 114 రన్స్ అవసరం. క్రీజులో సుందర్, జురేల్ ఉన్నారు. జైస్వాల్ (0), కేఎల్ రాహుల్ (1) నిరాశపరిచారు.
News November 16, 2025
పెరుగుతో అందం పెంచేయండి..

చర్మ సమస్యలను తగ్గించడానికి పెరుగు పరిష్కారం చూపుతుంది. * అరటిపండు, తెల్లసొన, శనగపిండి, పెరుగు కలిపి ముఖానికి రాయాలి. దీనివల్ల మోము మృదువుగా మారుతుంది. * పెరుగు, మెంతి పొడి, బాదం నూనె, గులాబీ నీళ్లు కలిపి ముఖానికి పూతలా వేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. * పెరుగులో రెండు చెంచాల ఓట్స్ పొడి వేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఓట్స్ చర్మానికి క్లెన్సర్లా పనిచేసి మృత కణాలు, మురికినీ తొలగిస్తాయి.


