News September 6, 2024
తెలుగు రాష్ట్రాలకు సురేశ్ ప్రొడక్షన్స్ రూ. కోటి సాయం
వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాల సహాయార్థం సురేశ్ ప్రొడక్షన్స్ తరఫున రూ. కోటి విరాళమిస్తున్నట్లు నటుడు వెంకటేశ్ ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘వరద బాధితులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాం. అందరం కలిసి రాష్ట్రాల్ని పునర్నిర్మించుకుని బలంగా నిలబడదాం’ అని పేర్కొన్నారు. తన పేరుతో పాటు రానా దగ్గుబాటి పేరు ఉన్న ఓ ప్రకటనను తన పోస్టుకు జత చేశారు.
Similar News
News September 16, 2024
నీరజ్ చోప్రా తాజా ట్వీటుకు మనూ భాకర్ స్పందన ఏంటంటే?
గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా త్వరగా కోలుకోవాలని షూటర్ మనూ భాకర్ ఆకాంక్షించారు. డైమండ్ లీగులో రజతంతో 2024లో ఈ సీజన్ను అద్భుతంగా ముగించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ సీజన్లో నేనెంతో నేర్చుకున్నాను. నాలో ఎన్నో మార్పులు వచ్చాయి. సోమవారం ప్రాక్టీస్ చేస్తుండగా నా ఎడమచేతికి ఫ్రాక్చర్ అయినట్టు ఎక్స్రే ద్వారా తెలిసింది. మీ సపోర్టుకు థాంక్స్’ అన్న నీరజ్ ట్వీటుకు మను స్పందించడం నెటిజన్లను ఆకర్షించింది.
News September 16, 2024
75ఏళ్లలో అతి పెద్ద తుఫాన్.. చైనాలోకి ఎంట్రీ
పెను తుఫాను బెబింకా చైనాలోని షాంఘైలో తీరం దాటింది. దాన్ని కేటగిరీ-1 తుఫానుగా పేర్కొంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 151 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. 1949లో గ్లోరియా టైఫూన్ తర్వాత గడచిన 75 ఏళ్లలో ఈస్థాయి తుఫాను రాలేదని పేర్కొన్నారు. తుఫాను ప్రభావంతో షాంఘైలో వందలాది విమానాలను రద్దు చేశారు. కాగా గత వారమే చైనాలో యాగీ తుఫాను తీరం దాటిన సంగతి తెలిసిందే.
News September 16, 2024
బాణసంచా పేలి భవనం ధ్వంసం.. ఏడుగురికి తీవ్ర గాయాలు!
AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బాణసంచా పేలి ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం ధ్వంసమైంది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.