News November 22, 2024

కోటి కుటుంబాలకు సర్వే పూర్తి

image

TG: రాష్ట్రవ్యాప్తంగా కోటి కుటుంబాలకు సమగ్ర ఇంటింటి సర్వే పూర్తయిందని ప్రభుత్వం వెల్లడించింది. ములుగు, జనగామ జిల్లాల్లో 100 శాతం, నల్గొండ, మెదక్ జిల్లాల్లో 99.9 శాతం సర్వే పూర్తయినట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.16 కోట్ల నివాసాలు గుర్తించామని, నేటి వరకు 1.01 కోట్ల నివాసాల్లో సర్వే కంప్లీట్ చేసి 87.1 శాతం సాధించామని వివరించింది.

Similar News

News October 20, 2025

VITMలో 12పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

విశ్వేశ్వరయ్య ఇండస్ట్రీయల్& టెక్నలాజికల్ మ్యూజియం(VITM)లో 12 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ITI, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీటిలో ఎగ్జిబిషన్ అసిస్టెంట్, టెక్నీషియన్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ.885. మహిళలు, SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వెబ్‌సైట్: https://www.vismuseum.gov.in/

News October 20, 2025

తీరు మారని ట్రంప్.. భారత్‌కు మరోసారి వార్నింగ్

image

ట్రంప్ తీరు మారడం లేదు. తన పాలనను వ్యతిరేకిస్తూ <<18047118>>రోడ్డెక్కిన<<>> US ప్రజలను పట్టించుకోకుండా ఇతర దేశాల పంచాయితీల్లో వేలు పెడుతున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు భారత్‌పై భారీగా టారిఫ్స్ విధిస్తానని మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ‘రష్యా నుంచి ఆయిల్ కొనబోమని PM మోదీ నాతో చెప్పారు. ఒకవేళ కొనసాగిస్తే భారీ టారిఫ్స్ తప్పవు’ అని హెచ్చరించారు. కాగా ట్రంప్‌తో అసలు మాట్లాడలేదని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది.

News October 20, 2025

దేశంలో యూపీఐ ద్వారానే 85% డిజిటల్ చెల్లింపులు: RBI

image

ఇండియాలో 85శాతం డిజిటల్ చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. UPI దేశ డిజిటల్ ఎకానమీలో విప్లవమని వరల్డ్ బ్యాంక్, IMF సమావేశాల్లో పేర్కొన్నారు. ప్రతి నెలా 20 బిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయన్నారు. యూపీఐ కేవలం ఆర్థిక సాధనం మాత్రమే కాదని, సామాజిక, ఆర్థిక సమానత్వానికి సూచిక అని అభిప్రాయపడ్డారు. యూపీఐ పరిధి దేశాలు దాటిందని వివరించారు.