News November 16, 2024
44 శాతం ఇళ్లలో సర్వే పూర్తి

TG: రాష్ట్రవ్యాప్తంగా 1.16 కోట్ల ఇళ్లకుగాను 51.24 లక్షల(44.1శాతం) నివాసాల్లో సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. సర్వేలో 87,807 మంది సిబ్బంది పాల్గొంటున్నారని, 8,788 మంది అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సర్వే తీరుపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ‘ప్రజల అభ్యున్నతి కోసమే సర్వే చేస్తున్నాం. ఇది దేశానికే ఆదర్శంగా నిలవాలి’ అని సూచించారు.
Similar News
News February 2, 2026
రాష్ట్ర ప్రగతికి చేయూతనిచ్చేలా కేంద్ర బడ్జెట్: పవన్

AP: కేంద్ర బడ్జెట్ ఫలాలు ఏపీ ప్రగతికి దోహదం చేసేలా ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. పర్యాటక రంగ ప్రోత్సాహకాలు అరకు అభివృద్ధికి, ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ రాష్ట్ర తీర ప్రాంత పారిశ్రామిక ప్రగతికి మరింత ఊతం ఇస్తుందన్నారు. బడ్జెట్లో కొబ్బరి, జీడిపప్పు, కోకో రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలతో కోనసీమ కొబ్బరి రైతులకు, ఉత్తరాంధ్ర జీడి రైతులకు మేలు జరుగుతుందని ఆకాంక్షించారు.
News February 2, 2026
అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఖండించారు. ఇరాన్పై అమెరికా దాడికి దిగితే అది రెండు దేశాలకే పరిమితం కాదని, భీకరమైన ప్రాంతీయ యుద్ధంగా మారుతుందని హెచ్చరించారు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కానీ తమపై దాడి జరిగితే మాత్రం గట్టిగా సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. అణు ఒప్పందంపై ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మధ్యప్రాచ్యంలో సంచలనం రేపుతున్నాయి.
News February 2, 2026
ఫిబ్రవరి 02: చరిత్రలో ఈ రోజు

☛ 1863: తెలుగు రచయిత కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి జననం
☛ 1902: పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు మోటూరి సత్యనారాయణ జననం
☛ 1940: రచయిత ఎస్.వి. రామారావు జననం
☛ 1970: ఒంగోలు జిల్లా అవతరణ
☛ 2012: నిర్మాత, నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య మరణం
☛ 2023: దర్శకుడు కె.విశ్వనాథ్ మరణం (ఫొటోలో)


