News November 12, 2024

SURVEY: ఆస్తుల వివరాలు చెప్పట్లేదు!

image

TG: ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం వెళ్లిన సిబ్బందికి తమ ఆస్తులు, అప్పుల వివరాలు చెప్పేందుకు ప్రజలు సుముఖత చూపడం లేదు. ప్రశ్నావళిలో 75 ప్రశ్నలుండగా కేవలం కులం చెప్పడంతోనే సరిపెడుతున్నారు. సర్వే ఎందుకనే విషయంలో ఎన్యుమరేటర్లు ఇచ్చే వివరణలతో ప్రజలు తృప్తి చెందడం లేదు. ఒక్కో ఫాం నింపేందుకు సిబ్బందికి గంట సమయం పడుతోంది. రోజుకు 6-7ఇళ్లలో మాత్రమే వివరాలు సేకరిస్తున్నారు.

Similar News

News January 25, 2026

17న ఫ్రీగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

image

AP: వచ్చే నెల 17న రాష్ట్రంలో 1-19 ఏళ్లలోపు ఉన్న 1.11 కోట్ల మందికి ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా ఇవ్వనున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. వీరిలో ఐదేళ్లలోపు పిల్లలు 23 లక్షల మంది ఉన్నారన్నారు. ‘నులిపురుగుల వల్ల ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, రక్తహీనత, ఎదుగుదల లోపం వంటి సమస్యలు వస్తాయి. ఆల్బెండజోల్ మాత్రలతో వీటిని నివారించవచ్చు’ అని పేర్కొన్నారు.

News January 25, 2026

అభిమానికి గోల్డ్ చైన్ ఇచ్చిన రజినీకాంత్

image

సూపర్‌స్టార్ రజినీకాంత్ తన అభిమానికి బంగారు గొలుసు ఇచ్చారు. మధురైలో పేదల కోసం కేవలం రూ.5కే పరోటా విక్రయిస్తున్న ‘రజినీ శేఖర్’ సేవలను ప్రశంసించారు. శేఖర్ కుటుంబాన్ని చెన్నైలోని తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రజినీకాంత్ ‘జైలర్ 2’ మూవీతో బిజీగా ఉండగా, ఏప్రిల్ నుంచి సిబి చక్రవర్తి దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

News January 25, 2026

అసెంబ్లీ గందరగోళంపై రాష్ట్రపతికి నివేదిక

image

కర్ణాటక అసెంబ్లీలో జరిగిన <<18923034>>గందరగోళం<<>>పై ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ రాష్ట్రపతి ముర్ముకు నివేదిక సమర్పించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలు ఉన్న కారణంగా ప్రసంగ ముసాయిదాలోని 2 నుంచి 11 పేరాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించానని తెలిపారు. అదే విధంగా ప్రసంగం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని నివేదికలో పేర్కొన్నారు.