News June 2, 2024

పవన్‌దే గెలుపన్న సర్వేలు.. ముద్రగడపై ట్రోలింగ్

image

AP: పిఠాపురంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని సర్వే సంస్థలు అంచనా వేయడంతో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంపై ట్రోలింగ్ జరుగుతోంది. పవన్‌ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటూ గతంలో ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ జనసైనికులు పోస్టులు పెడుతున్నారు. ‘పెద్దాయన పేరు మరికొన్ని గంటల్లో పద్మనాభ రెడ్డిగా మారబోతుంది’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

Similar News

News November 25, 2025

సాయంత్రం ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్

image

TG: రాష్ట్ర ఎన్నికల సంఘం సా.6.15 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. పంచాయతీ ఎన్నికలపై షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో ఎన్నికల తేదీలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ రోజు షెడ్యూల్ ఇచ్చి ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని SEC నిర్ణయించినట్లు తెలుస్తోంది.

News November 25, 2025

500 దాటిన సౌతాఫ్రికా ఆధిక్యం

image

భార‌త్‌తో రెండో టెస్టులో సౌతాఫ్రికా మరింత పట్టు బిగిస్తోంది. ఆ జట్టు ఆధిక్యం 503 పరుగులకు చేరింది. తొలి ఇన్నింగ్స్‌లో 489 రన్స్ చేసిన సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 215 రన్స్ చేసింది. క్రీజులో ఉన్న స్టబ్స్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అటు వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు శ్రమిస్తున్నారు. జడేజా 3 వికెట్లు పడగొట్టారు.

News November 25, 2025

బిహార్ ఓటమి.. ఏడుగురు నేతలపై కాంగ్రెస్ వేటు

image

బిహార్ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఏడుగురు కాంగ్రెస్ నేతలను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించింది. క్రమశిక్షణ, పార్టీ సంస్థాగత సూత్రాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకుంది. ఆదిత్య పాశ్వాన్, షకీలుర్ రెహమాన్, రాజ్‌ కుమార్ శర్మ, రాజ్‌కుమార్ రాజన్, కుందన్ గుప్తా, కాంచన కుమారి, రవి గోల్డెన్‌ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు కాంగ్రెస్ బిహార్ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ ఉత్తర్వులిచ్చారు.