News May 14, 2024
రెండు అణుబాంబుల్ని తట్టుకుని బతికాడు!

జపాన్పై అమెరికా వేసిన రెండు అణుబాంబుల్ని తట్టుకుని బతికిన మృత్యుంజయుడు త్సుటోము యమగుచి. హిరోషిమాపై తొలిబాంబు పడే రోజు బాంబు పేలడాన్ని ముందుగానే చూసి డ్రైనేజీలో దూకారు. అయినా సరే ఒళ్లంతా కాలిపోయింది. అక్కడి నుంచి బయటపడి తన స్వస్థలమైన నాగసాకిలో ఆస్పత్రిలో చేరారు. రెండ్రోజులకు అక్కడా బాంబు దాడి జరిగింది. అదృష్టం కొద్దీ మళ్లీ బతికారు. సుదీర్ఘకాలం జీవించిన యమగుచి, 2010లో క్యాన్సర్ కారణంగా చనిపోయారు.
Similar News
News March 4, 2026
దుబాయ్, ఖతర్లో అమెరికా లక్ష్యాలపై ఇరాన్ దాడులు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. దుబాయ్లోని US కాన్సులేట్ సమీపంలో ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. మరోవైపు ఖతర్లోని అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం అల్ ఉదైద్ లక్ష్యంగా ఇరాన్ 2 బాలిస్టిక్ మిస్సైల్స్ను ప్రయోగించింది. వీటిలో ఒకదాన్ని డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకోగా రెండో క్షిపణి ఎయిర్ బేస్ను తాకింది. ఈ ఘటనల్లో ఆస్తి నష్టం సంభవించినా ప్రాణనష్టం జరగలేదు.
News March 4, 2026
రేపు టెన్త్ హాల్ టికెట్లు విడుదల

ఏపీలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి <
News March 4, 2026
ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు?

జూన్ తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరిగేలా కనిపిస్తోంది. ప్రస్తుత పాలకవర్గాల గడువు ఏప్రిల్ 2తో ముగియనుండగా ప్రత్యేక పాలన విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏకసభ్య కమిషన్ నివేదిక, BC రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభానికి 3నెలలు పట్టే అవకాశం ఉంది. కమిషన్ నివేదిక ఆలస్యమైనా, రిజర్వేషన్ల అంశం కోర్టుకెక్కినా పంచాయతీ ఎన్నికలు మరింత ఆలస్యం కావచ్చు. అటు పరిషత్ ఎన్నికల తర్వాతే ‘పంచాయతీ’ నిర్వహించాలనే వాదనా ఉంది.


