News October 3, 2024
స్వల్ప గాయాలతో బయటపడ్డా: హీరోయిన్

షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో జరిగిన ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డానని హీరోయిన్ ప్రియాంకా మోహన్ తెలిపారు. ‘నేను క్షేమంగా ఉన్నాను. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. నేను క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అభిమానులు, శ్రేయోభిలాషులు మెసేజ్లు, ట్వీట్స్ చేశారు. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని ఆమె ట్వీట్ చేశారు.
Similar News
News April 4, 2026
మహిళలను వేధించే వారిని ఉపేక్షించొద్దు: CBN

AP: మాచర్లలో ఉద్యోగినిపై అత్యాచారయత్న ఘటనలో నిందితుణ్ని త్వరగా అరెస్టు చేయాలని CM CBN పోలీసులను ఆదేశించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకొని మహిళల పట్ల అఘాయిత్యాలకు పాల్పడే వారిని ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పాలని సూచించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామని అధికారులు CMకు తెలిపారు. కొందరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. బాధితురాలికి గుంటూరు GGHలో చికిత్స అందిస్తున్నామన్నారు.
News April 4, 2026
పాక్పై భారత్ మరోసారి దాడి చేస్తుందా?

పశ్చిమాసియా యుద్ధంతో పాక్లో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. దీన్నే అవకాశంగా మలుచుకొని దాయాదిని దెబ్బకొట్టాలని IND భావిస్తోందా? ఉగ్రవాదాన్ని పోషిస్తూ కంట్లో నలుసులా మారిన PAKను OpS-2తో నాశనం చేయడానికి సిద్ధమవుతోందా? త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ భేటీలు, పాక్కు <<19547918>>వార్నింగ్<<>>, రాష్ట్రాల్లో మాక్ డ్రిల్, ప్రజలకు 3 నెలల రేషన్(యుద్ధం వస్తే ఇబ్బంది పడకుండా) సరఫరా ఈ ప్రశ్నలకు బలం చేకూరుస్తున్నాయి.
News April 4, 2026
BRS ఖాతాలో మరో రెండు మున్సిపాలిటీలు

TG: గతంలో వాయిదా పడ్డ ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠాలను BRS కైవసం చేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య తాజాగా జరిగిన ఎన్నికలో రెండు మున్సిపాలిటీలను ఖాతాలో వేసుకుంది. క్యాతనపల్లి ఛైర్మన్గా గొడిశెల సంధ్యారాణి, ఇబ్రహీంపట్నం ఛైర్మన్గా సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు.


