News October 9, 2024
కోహ్లీ రికార్డుకు దగ్గర్లో సూర్య
బంగ్లాదేశ్తో టీమ్ఇండియా ఈరోజు రెండో టీ20 ఆడనుంది. ఈమ్యాచ్లో టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 39 పరుగులు చేస్తే కోహ్లీ రికార్డును సమం చేయవచ్చు. అత్యంత తక్కువ T20 మ్యాచుల్లో 2500 పరుగులు చేసిన రెండో బ్యాటర్గా కోహ్లీ నిలిచారు. విరాట్ 73 మ్యాచుల్లో 2500 పరుగుల మార్క్ను దాటారు. SKY 72 మ్యాచుల్లో 2461 రన్స్ చేశారు. పాక్ బ్యాటర్ బాబర్ 67 మ్యాచుల్లోనే 2500రన్స్ చేసి ప్రథమ స్థానంలో ఉన్నారు.
Similar News
News October 9, 2024
‘యానిమల్’ రోల్పై ట్రోలింగ్తో ఏడ్చేశా: త్రిప్తి
‘యానిమల్’లో తాను పోషించిన రోల్పై సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన విమర్శలు రావడంతో నటి త్రిప్తి దిమ్రీ 2-3 రోజులు ఏడుస్తూ కూర్చున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సందీప్రెడ్డి డైరెక్షన్లో రణ్బీర్ హీరోగా వచ్చిన ఆ మూవీలో త్రిప్తి బోల్డ్ క్యారెక్టర్ చేశారు. దానిపై వచ్చిన ట్రోలింగ్ను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదని ఆమె అన్నారు. అయితే కొన్నిసార్లు ఏడవటమూ గాయం నుంచి బయటపడేస్తుందని చెప్పుకొచ్చారు.
News October 9, 2024
తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.760 తగ్గి రూ.76,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 తగ్గి రూ.70,300కి చేరుకుంది. కేజీ సిల్వర్ ధర రూ.2,000 పడిపోయి రూ.1,00,000కి చేరింది.
News October 9, 2024
WTC: రికార్డు సృష్టించిన రూట్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(WTC) చరిత్రలో 5వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్గా ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ (5005) రికార్డు సృష్టించారు. ప్రస్తుతం పాకిస్థాన్తో జరుగుతోన్న తొలి టెస్టులో ఈ ఘనత సాధించారు. 59 మ్యాచుల్లో అతను ఈ ఫీట్ను అందుకోగా, అతని తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు లబుషేన్(3904), స్మిత్(3,484) ఉన్నారు.