News July 27, 2024
సూర్య తాత్కాలిక కెప్టెన్ మాత్రమే: స్టైరిస్

భారత్కు సూర్యకుమార్ యాదవ్ తాత్కాలిక కెప్టెన్ మాత్రమేనని న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ స్టైరిస్ అభిప్రాయపడ్డారు. శుభ్మన్ గిల్ను భవిష్యత్ కెప్టెన్గా భారత్ చూస్తోందని అంచనా వేశారు. ‘గిల్ మరింత పరిపక్వత సాధించేవరకు అతడిని వైస్ కెప్టెన్గా కొనసాగించాలని టీమ్ ఇండియా భావిస్తున్నట్లు అనిపిస్తోంది. సూర్యది కూడా పెద్ద వయసే. గిల్ కెప్టెన్గా వచ్చేవరకు అతడు సారథిగా ఉంటారు’ అని పేర్కొన్నారు.
Similar News
News December 11, 2025
ట్రంప్ గోల్డ్ కార్డ్.. US పౌరసత్వానికి రాజమార్గం

US ప్రెసిడెంట్ ట్రంప్ ప్రవేశపెట్టిన ‘<<18527355>>గోల్డ్ కార్డ్<<>>’ హాట్టాపిక్గా మారింది. ఈ స్కీమ్ ద్వారా అత్యంత వేగంగా ఆ దేశ పౌరసత్వం పొందచ్చు. భారీగా డబ్బులు ఇచ్చే వ్యక్తులు, కంపెనీలకు లీగల్ స్టేటస్, పౌరసత్వం ఇవ్వనున్నారు. వ్యక్తిగతంగా అప్లై చేస్తే $1M, కంపెనీలు స్పాన్సర్ చేస్తే $2M చెల్లించాలి. దీంతో పాటు DHS ఫీజు $15,000 కట్టాలి. అదే గ్రీన్ కార్డు కావాలంటే ఏళ్లపాటు నిరీక్షణ, కఠిన నిబంధనలు ఉంటాయి.
News December 11, 2025
ఆయుర్వేద స్నానం గురించి తెలుసా?

చాలామంది పనుల హడావుడిలో త్వరత్వరగా స్నానం ముగించేస్తుంటారు. కానీ శరీరానికి కలిగిన శ్రమను మర్చిపోయేలా చేసేదే నిజమైన స్నానం. ఆయుర్వేదం ప్రకారం స్నానం చేసే నీళ్లల్లో కొన్ని పదార్థాలు కలిపి చేస్తే హాయిగా ఉంటుంది. స్నానం చేసే నీటిలో కాస్త గంధం పొడి, మల్లెలు, గులాబీ రేకలు వేసుకుని చేస్తే ఒళ్లంతా చక్కని సువాసన వస్తుంది. కమలాపండు, నిమ్మతొక్కలను వేడినీళ్లలో వేసుకుని స్నానం చేస్తే శరీరం తేలిగ్గా అవుతుంది.
News December 11, 2025
మీకంటే అసద్ యాక్టివ్: T BJP ఎంపీలతో మోదీ

తెలంగాణలో BJP MPలు సరైన ప్రతిపక్షపాత్ర పోషించలేకపోతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తంచేశారు. అసదుద్దీన్ సోషల్ మీడియా టీమ్ యాక్టివ్గా ఉందని ఉదహరించారు. వారి పనితీరు మారాలని, SMలో చురుగ్గా ఉండాలని హితబోధ చేశారు. AP, TGల NDA MPలకు అల్పాహార విందులో మోదీ ఈ కామెంట్స్ చేశారు. ఏపీలో చంద్రబాబు పాలన భేష్ అంటూ ఈ భేటీలో కితాబు ఇచ్చారు. అందుకే ఏపీకి పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయన్నారు.


