News July 16, 2024
టీమ్ ఇండియా కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్?

టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో హార్దిక్ పాండ్య పగ్గాలు చేపడతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ రేసులోకి వచ్చారని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI) తెలిపింది. 2026 టీ20 ప్రపంచకప్ వరకు సూర్య T20లకు సారథిగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు గంభీర్, అజిత్ అగార్కర్.. పాండ్యతో చర్చించారని, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు PTI వివరించింది.
Similar News
News November 25, 2025
జగిత్యాల కార్ ఓనర్స్ & డ్రైవర్స్ జిల్లా అధ్యక్షుడిగా వెంకటేష్

జగిత్యాల జిల్లా కేంద్రంలో కారు ఓనర్స్ & డ్రైవర్స్ జిల్లా సమావేశం నిర్వహించి కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సురుగు వెంకటేష్, ఉపాధ్యక్షుడిగా దాది రఘుపతి, కార్యదర్శిగా దండే రమేష్, అదనపు కార్యదర్శిగా మాలి కిషన్, కోశాధికారిగా మధురవేణి మహేష్, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వెంకటేష్ మాట్లాడుతూ.. డ్రైవర్ల హక్కుల కోసం నిరంతరం పనిచేస్తూ వారికి అండగా ఉంటానని తెలిపారు.
News November 25, 2025
బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్: సుందర్

గువాహటి పిచ్ బ్యాటింగ్కు అనుకూలమేనని భారత ఆల్రౌండర్ <<18375894>>వాషింగ్టన్<<>> సుందర్ అన్నారు. పరుగులు చేయకుండా ఎక్కువ సేపు నియంత్రించలేరని చెప్పారు. ‘ఇదేమీ బ్యాటింగ్కు కష్టమైన పిచ్ కాదు. ట్రూ వికెట్. ఇలాంటివి ఇండియాలో అరుదుగా ఉంటాయి. క్రీజ్లో నిలబడితే రన్స్ వస్తాయి’ అని తెలిపారు. 6 వికెట్లు తీసిన జాన్సెన్కు అసాధారణ బౌన్స్ రాలేదని, అతడు ఎత్తుగా ఉండటం వల్ల గుడ్ లెంత్లో బౌలింగ్ చేశారని పేర్కొన్నారు.
News November 25, 2025
మంచి జరగబోతోంది: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ పీస్ టాక్స్లో ముందడుగు పడినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హింట్ ఇచ్చారు. ‘శాంతి చర్చల విషయంలో పెద్ద పురోగతి సాధించడం సాధ్యమేనా? మీరు చూసే దాకా దీన్ని నమ్మకండి. కానీ ఏదో ఒక మంచి జరగబోతోంది’ అని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. కాగా యూఎస్ శాంతి ప్రతిపాదనను మెరుగుపరచాలని అంగీకరించినట్లు జెనీవా చర్చల తర్వాత అమెరికా, ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు.


