News July 31, 2024
సూర్యకుమార్ యాదవ్ మరో ఘనత

టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో ఘనత సాధించారు. టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు అందుకున్న రెండో ప్లేయర్గా స్కై (5) నిలిచారు. ఈ క్రమంలో బాబర్ ఆజమ్, షకీబ్, వార్నర్(5)ను సమం చేశారు. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో ఆయన ఈ ఘనత సాధించారు. అగ్ర స్థానంలో కోహ్లీ (7) ఉన్నారు. కాగా నిన్నటి మ్యాచ్లో సూర్య బౌలింగ్లో అదరగొట్టారు. చివరి ఓవర్లో 2 వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పారు.
Similar News
News November 7, 2025
త్వరలో 2,837 కంప్యూటర్ టీచర్ జాబ్స్!

TG: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ITలో శిక్షణ ఇచ్చేందుకు 2,837 కంప్యూటర్ టీచర్లను (ICT Instructors) నియమించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. 5 కంప్యూటర్ల కంటే ఎక్కువ ఉన్న స్కూళ్లలో వీరిని నియమించి, నెలకు రూ.15వేలు గౌరవ వేతనంగా చెల్లిస్తారని సమాచారం. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన ఫైల్ను ఇప్పటికే CMకు పంపగా, ఆయన ఆమోదం తర్వాత నోటిఫికేషన్ రానుంది.
News November 7, 2025
విటమిన్స్ లోపం-లక్షణాలు

విటమిన్ల లోపం కొన్ని లక్షణాల ద్వారా బయట పడుతూ ఉంటుంది. నోటి చివర్లలో పగుళ్లు ఏర్పడుతుంటే జింక్, ఐరన్, బి విటమిన్లు (నయాసిన్, రైబోఫ్లోవిన్, విటమిన్ బి12) లోపం. చర్మంపై రాషెస్, జుట్టు రాలడం ఉంటే బయోటిన్ (విటమిన్ బి7) లోపం. చేతులు, పాదాల్లో చురుక్కుమనడం, తిమ్మిర్లుంటే బి విటమిన్ల (ఫోలేట్, బి6, బి12)లోపమని అర్థం చేసుకోవాలి. కాళ్లలో పోట్లు ఉంటే మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం లోపమని గుర్తించాలి.
News November 7, 2025
చరిత్ర సృష్టించిన మస్క్.. $1 ట్రిలియన్ ప్యాకేజ్

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించారు. ఆయనకు $1 ట్రిలియన్ (₹88 లక్షల కోట్లు) ప్యాకేజ్ ఇచ్చేందుకు 75% టెస్లా షేర్హోల్డర్లు ఆమోదం తెలిపారు. దీంతో కార్పొరేట్ రంగంలో అత్యంత ఎక్కువ ప్యాకేజ్ గల CEOగా చరిత్ర సృష్టించారు. అయితే మస్క్ నెల జీతంగా కాకుండా ఆ మొత్తాన్ని వచ్చే పదేళ్లలో స్టాక్స్ రూపంలో పొందుతారు. ప్రస్తుతం 476 బి.డాలర్లతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.


