News March 17, 2024

సూర్యాపేట: తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి

image

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం గుండపురిలో ప్రమాదవశాత్తు తాడిచెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన పాలకుర్తి వెంకన్న రోజు మాదిరి కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కాడు. కల్లు గీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News February 5, 2026

NLG: భార్యల గెలుపునకు భర్తల ఇంటింటి ప్రచారం

image

మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించడంతో ఆసక్తికర దృశ్యాలు కనిపిస్తున్నాయి. గతంలో భర్తల కోసం భార్యలు ప్రచారం చేయగా, ఇప్పుడు భార్యల గెలుపు కోసం భర్తలు జెండాలు పట్టుకుని ఇంటింటికీ తిరుగుతున్నారు. ముఖ్యంగా నల్గొం, మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్ పర్సన్ పీఠాలు మహిళలకే కేటాయించడంతో అభ్యర్థుల భర్తలు ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకుని ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

News February 5, 2026

NLG: ఏదీ గిరి వికాసం.. అటకెక్కిన మరో పథకం!

image

జిల్లాలో గిరిజన రైతు కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంతో చేపట్టిన సీఎం గిరి వికాస పథకం అటకెక్కింది. రెండేళ్ల క్రితమే జిల్లావ్యాప్తంగా గిరిజన లబ్ధిదారులను గుర్తించి వారి భూముల్లో 56 బోర్లు వేసినా.. వాటికి విద్యుత్ సౌకర్యం, మోటార్లు అందించలేదు. రెండేళ్లుగా ఎలాంటి కదలిక లేకపోవడంతో అసలు ఈ పథకం ఉందా లేదా అని లబ్ధిదారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

News February 5, 2026

NLG: తగ్గుతున్న పంటల సాగు.. వరిదీ అదే పరిస్థితి

image

మారిన వాతావరణ పరిస్థితులు.. సాగు ఖర్చులు పెరగడం.. దిగుబడులు తగ్గడం గిట్టుబాటు ధరలు లేకపోవడం తదితర కారణాలతో జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతుంది. ఈ యాసంగిలో జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో 5.50 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని పేర్కొన్నప్పటికీ.. ఈ సీజన్ ముగిసేనాటికి 4.36 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయింది.