News March 21, 2024
షోలాపూర్ ఎంపీ అభ్యర్థిగా సుశీల్ కుమార్ కూతురు

కాంగ్రెస్ 57 మంది ఎంపీ అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణితి షిండేకు చోటు కల్పించింది. ఆమెను షోలాపూర్ నుంచి బరిలో నిలిపింది. ప్రణితి గతంలో మహారాష్ట్ర PCC చీఫ్గా పనిచేశారు. షోలాపూర్ సిటీ సెంట్రల్ నుంచి మూడుసార్లు MLAగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధరి బెహరంపుర్(బెంగాల్) నుంచి పోటీ చేస్తున్నారు.
Similar News
News October 25, 2025
అర్ధరాత్రి లోపు అప్డేట్ చేయకపోతే జీతాలు రావు: ఆర్థిక శాఖ

TG: అక్టోబర్ నెల వేతనాలను ఆధార్తో లింక్ అయి ఉన్న <<18038300>>ఉద్యోగులకే<<>> ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అన్ని శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులర్ పంపారు. ఇవాళ అర్ధరాత్రి IFMIS పోర్టల్లో ఆధార్ లింక్ చేయాలని డెడ్లైన్ విధించింది. ఆధార్తో లింక్ కాని ఉద్యోగులకు జీతాలు జమ కావని స్పష్టంచేశారు.
News October 25, 2025
మరో రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: తుఫాన్ నేపథ్యంలో అధికారులు మరో రెండు జిల్లాలకు సెలవు ఇచ్చారు. ఇప్పటికే తూ.గో, అన్నమయ్య, కృష్ణా జిల్లాల్లోని విద్యాసంస్థలకు <<18103274>>హాలిడేస్<<>> ప్రకటించగా తాజాగా బాపట్ల, కడప జిల్లాల్లోనూ సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్లలో ఈనెల 27,28,29న, కడపలో 27,28న ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు.
News October 25, 2025
US ఆఫీసర్ హత్య.. మోదీని టార్గెట్ చేసినందుకేనా?

US స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెర్రెన్స్ జాక్సన్ బంగ్లాదేశ్లో హత్యకు గురవడం అనుమానాలకు దారితీసింది. PM మోదీని చంపేందుకు CIA కుట్ర చేసిందని, దాన్ని భగ్నం చేసేందుకే ఇండియా, రష్యా టెర్రెన్స్ను హతమార్చిందని అంతర్జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. అతడు చనిపోయిన రోజు చైనాలో మోదీ, పుతిన్ కార్లో రహస్యంగా చర్చించారని పేర్కొన్నాయి. దేశ ప్రజలకు నిజమేంటో చెప్పాలని కాంగ్రెస్ నేత సింఘ్వీ తాజాగా డిమాండ్ చేశారు.


