News July 18, 2024
T20 కెప్టెన్సీపై కొనసాగుతున్న సస్పెన్స్!

టీమ్ ఇండియా టీ20 కెప్టెన్సీపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కొత్త కెప్టెన్, శ్రీలంక టూర్కు జట్టు ఎంపికపై కోచ్ గంభీర్ బీసీసీఐ సెక్రటరీ జైషాతో చర్చించారు. ముఖ్యంగా టీ20 జట్టుకు సారథిగా సూర్యకుమార్ను నియమించాలని కోచ్ గంభీర్ కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు హార్దిక్నే కెప్టెన్గా కొనసాగించాలని షా భావిస్తున్నారట. అందుకే కెప్టెన్సీపై ఇప్పటికీ స్పష్టత రావడం లేదని జాతీయ మీడియా పేర్కొంది.
Similar News
News January 15, 2026
నల్గొండ: తొలి మేయర్ పీఠంపై పార్టీల కన్ను

నల్గొండ కార్పొరేషన్ తొలి మేయర్ పీఠం కోసం ప్రధాన పార్టీలు వ్యూహాల్లో మునిగిపోయాయి. ఉమ్మడి జిల్లాలో అత్యధిక మున్సిపాలిటీలను సైతం దక్కించుకోవాలనుకుంటున్నాయి. అటు అధికార కాంగ్రెస్లో ఆశావహులు పెరిగి టికెట్ల లొల్లి మొదలైంది. మరోవైపు BRS కేడర్లో జోష్ నింపేందుకు లీడర్లు ప్రయత్నిస్తుండగా, బీజేపీలో వర్గపోరు హైకమాండ్కు తలనొప్పిగా మారింది. కమ్యూనిస్టులు, MIM ‘కింగ్ మేకర్’ పాత్ర కోసం పావులు కదుపుతున్నాయి.
News January 15, 2026
ISS నుంచి స్టార్ట్ అయిన వ్యోమగాములు

ISS నుంచి నలుగురు వ్యోమగాములు ముందుగానే భూమికి తిరిగొస్తున్న <<18804760>>విషయం<<>> తెలిసిందే. ఒక వ్యోమగామికి ఆరోగ్య సమస్య తలెత్తడంతో నాసా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వారు భారతీయ కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున 3:50కి స్టార్ట్ అయ్యారు. స్పేస్-X డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్లో ఇద్దరు అమెరికన్, ఒక జపాన్, ఒక రష్యన్ వ్యోమగామి ప్రయాణిస్తున్నారు. 2:OO PMకి కాలిఫోర్నియాలోని పసిఫిక్ సముద్రంలో ల్యాండ్ కానున్నారు.
News January 15, 2026
మెనోపాజ్లో ఒత్తిడి ప్రభావం

మెనోపాజ్ దశలో శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పుల కారణంగా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అధిగమించే మార్గాల గురించి నిపుణులను, తోటి మహిళలను అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నచ్చిన పనులు చేయడం, కంటి నిండా నిద్ర పోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.


