News April 25, 2024
కొనసాగుతున్న ఉత్కంఠ.. ఇవాళైనా వచ్చేనా?

TG: కాంగ్రెస్ పెండింగ్లో పెట్టిన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఎంపీ స్థానాల అభ్యర్థులపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇవాళ జాబితా రానున్నట్లు సమాచారం. ఖమ్మం అభ్యర్థిగా రఘురామిరెడ్డి పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతుండగా మరో అభ్యర్థిని పరిశీలించాలని ఒత్తిడి రావడంతో అధికారిక ప్రకటన ఆగింది. మరోవైపు కరీంనగర్కు వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్కు మహ్మద్ వలీ ఉల్లా సమీర్ పేర్లను INC పరిశీలించినట్లు తెలుస్తోంది.
Similar News
News October 18, 2025
DDAలో 1,732 పోస్టులు.. అప్లై చేశారా?

ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ 1,732 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష(స్టేజ్1, స్టేజ్ 2), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, Jr ఇంజినీర్, SO, స్టెనోగ్రాఫర్, JSA, మాలి, MTS తదితర పోస్టులు ఉన్నాయి. వెబ్సైట్: https://dda.gov.in/. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 18, 2025
వివరాలు ఇవ్వకపోతే ఈనెల జీతం రాదు: ఆర్థిక శాఖ

TG: ఆధార్, ఫోన్ నంబర్లను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయని ఉద్యోగులకు ఈనెల జీతం రాదని ఆర్థిక శాఖ హెచ్చరించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అక్రమాలను అరికట్టేందుకు సమగ్ర సమాచారం కోసం ప్రతినెల 10లోపు ఉద్యోగుల ఆధార్, ఫోన్ నంబర్లను నమోదు చేయాలని గతనెల ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటివరకు 5.21లక్షల రెగ్యులర్ ఉద్యోగుల్లో 2.22లక్షల మంది, 4.93లక్షల ఒప్పంద సిబ్బందిలో 2.74లక్షల మంది మాత్రమే వివరాలు అందించారు.
News October 18, 2025
సహజంగా పరిమళాలు అద్దేద్దాం..

ఎక్కడికైనా వెళ్లడానికి రెడీ అవ్వడం అంటే మేకప్, మంచి డ్రెస్ చివరిగా ఫెర్ఫ్యూమ్ వేసుకుంటాం. కానీ వీటిలో ఉండే రసాయనాల వల్ల దుస్తులపై మరకలు పడటంతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇలా కాకుండా కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ వాడితే రసాయనాలు లేకుండా సహజసిద్ధ పరిమళాలను ఆస్వాదించొచ్చంటున్నారు నిపుణులు. వాటిల్లో లావెండర్, మింట్, గంధం నూనె, రోజ్ ఆయిల్ వంటివి మంచి స్మెల్ని ఇస్తూనే ఆరోగ్యాన్నీ కాపాడతాయి.