News March 16, 2024
అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిపై సెస్పెన్స్

అన్ని ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధిష్ఠానం అనకాపల్లి సీటును మాత్రం పెండింగ్లో ఉంచింది. బీసీకి కేటాయించినట్లు చెప్పారు కానీ..అభ్యర్థి పేరు మాత్రం చెప్పలేదు. దీంతో ఎంపీ అభ్యర్థి పేరు ఎవరనేదానిపై సస్పెన్స్ నెలకొంది.
Similar News
News March 9, 2026
విశాఖ: హిందుజా పవర్ ప్లాంట్కు భారీ జరిమాన

విశాఖలో హిందుజా పవర్ ప్లాంట్పై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకుంది. ప్లాంట్ నుంచి వచ్చే యాష్పాండ్ ధూళి వలన స్థానిక ప్రజలు చర్మవ్యాధులు బారిన పడుతున్నారని టీడీపీ కార్పొరేటర్ రౌత్ శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హిందుజా పవర్ ప్లాంట్కు రూ.6 కోట్ల 78 లక్షలు జరిమానా విధించింది.
News March 9, 2026
విశాఖ భీమిలి బీచ్ రోడ్లో విరాగో రిసార్ట్ సీజ్..!

భీమిలి బీచ్ రోడ్డులో విరాగో రిసార్ట్ను సోమవారం అధికారులు సీజ్ చేశారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ కమిషనర్ ఉత్తర్వులతో అధికారులు రిసార్ట్ను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
News March 9, 2026
విశాఖ నుంచి మళ్లీ క్రూయిజ్ సేవలు

విశాఖ క్రూయిజ్ టెర్మినల్ నుంచి మళ్లీ క్రూయిజ్ సేవలు ప్రారంభం కానున్నాయి. కార్డిలియా క్రూయిజ్ షిప్ జూన్ 24న విశాఖకు చేరుకొని పుదుచ్చేరి మీదుగా చెన్నై వరకు ఐదు రోజుల సముద్ర విహార యాత్ర నిర్వహించనుంది. జులై 1, 8, 15 తేదీల్లో కూడా సేవలు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. నౌకలో ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, థియేటర్, స్విమ్మింగ్ పూల్స్, వినోద కార్యక్రమాలు వంటి సౌకర్యాలు ఉంటాయి.


