News August 2, 2024

ఉత్కంఠ.. భారత్ గెలుస్తుందా?

image

భారత్-శ్రీలంక వన్డే మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్ దూకుడుగా ప్రారంభించిన టీమ్ ఇండియా వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. టీమ్ ఇండియా గెలవాలంటే 42 బంతుల్లో 26 రన్స్ కావాలి. మరో 3 వికెట్లు చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం భారత్ స్కోర్ 42 ఓవర్లలో 205/7. మరి ఈ మ్యాచులో భారత్ గెలుస్తుందా? కామెంట్ చేయండి.

Similar News

News March 4, 2026

‘మద్యం’లో డిజిటల్ చెల్లింపులను పెంచేలా త్వరలో పాలసీ!

image

AP: మద్యం విక్రయాల్లో ప్రస్తుతం 30%గా ఉన్న డిజిటల్ చెల్లింపులను 60%కి పెంచేందుకు ఎక్సైజ్ శాఖ ‘లిక్కర్ డిజిటల్ చెల్లింపులు’ పాలసీని తీసుకురానుంది. దీని ప్రకారం ప్రతి షాపులో డిజిటల్ పేమెంట్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాల్సిందే. కొనుగోలుదారులు డిజిటల్ చెల్లింపులు చేస్తామంటే లైసెన్సీలు తిరస్కరించకూడదు. అలాగే ఏ రోజు ఎంత అమ్మారో తెలుసుకునేందుకు ‘ట్రాక్ అండ్ ట్రేస్’ విధానాన్ని కూడా ఎక్సైజ్ శాఖ తీసుకురానుంది.

News March 4, 2026

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

image

ఇరాన్-అమెరికా/ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1,568 పాయింట్లు కుంగి 78,669 వద్ద, నిఫ్టీ 476 పాయింట్లు క్షీణించి 24,388 దగ్గర ట్రేడవుతోంది. ఇన్ఫీ, BEL, HCL టెక్ షేర్లు లాభాల్లో.. LT, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, M&M, ఇండిగో షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92 మార్క్ దాటి ఆల్‌టైం కనిష్ఠాన్ని తాకింది.

News March 4, 2026

ఘోరం.. ఇంటర్ పరీక్ష రాసి బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చింది

image

TG: నాగర్‌కర్నూల్‌లో దారుణం జరిగింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని(16) ఈనెల 2న పరీక్ష రాసి కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరింది. వైద్యుల సూచనతో స్కానింగ్ సెంటర్‌కు వెళ్లగా అక్కడే బాత్రూంలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పసికందును తల్లితో కలిసి చెత్తబుట్టలో పడేసింది. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. KGBVలో చదువుతున్న ఈ బాలిక ఉదంతం స్థానికంగా కలకలం రేపింది.