News July 16, 2024
ఏపీలో భూముల రీ సర్వే నిలిపివేత

గత ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే అమలును నిలిపివేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. సర్వే పేరుతో గత పాలకులు భూముల సరిహద్దులను మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కబ్జాల నివారణకు ‘ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్ట్’ను త్వరలోనే తీసుకొస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో YCP నేతలు లాక్కున్న భూముల్ని తిరిగి బాధితులకు అప్పగిస్తామని పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
ఈనెల 30 లోగా దరఖాస్తులు పూర్తి చేయండి: కలెక్టర్

ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద అర్హులైన ప్రతి పేదవాడు లబ్ధిపొందేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ, గ్రామీణ పథకం కింద ఇంతవరకు 29 వేల 187 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 7,781 మంది వివరాలు సర్వే చేశామని తెలిపారు. ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
News November 17, 2025
ఈనెల 30 లోగా దరఖాస్తులు పూర్తి చేయండి: కలెక్టర్

ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద అర్హులైన ప్రతి పేదవాడు లబ్ధిపొందేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ, గ్రామీణ పథకం కింద ఇంతవరకు 29 వేల 187 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 7,781 మంది వివరాలు సర్వే చేశామని తెలిపారు. ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
News November 17, 2025
డిసెంబర్లో స్థానిక ఎన్నికలు.. క్యాబినెట్ నిర్ణయం!

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరపాలని డిసైడ్ అయింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. దీంతో డిసెంబర్లో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.


