News March 18, 2024
SVU: ఫలితాలు విడుదల

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది నవంబర్లో బీ ఫార్మసీ (B.Pharmacy) రెండవ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/, http://www.schools9.com/వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Similar News
News December 27, 2025
చిత్తూరు: GST స్కాంలో రూ.118.70 స్వాహా (2)

☞ MF ఎంటర్ప్రైజెస్- రూ.9.06 కోట్లు ☞ IB ట్రేడర్స్-రూ.2.04 కోట్లు, రూ.2.16 కోట్లు ☞AR స్టీల్స్-రూ.3.11 కోట్లు ☞ ZF ట్రేడర్స్- రూ.4.59 కోట్లు, ☞ ముజు మెటల్స్-రూ.5.73 కోట్లు ☞ అబ్రార్ టుడే ఫ్యాషన్ మాల్- రూ.5.36కోట్లు. ఈ స్కాంలో రాష్ట్రంలోనే చిత్తూరు మొదటి స్థానంలో నిలిచింది.
News December 27, 2025
చిత్తూరు జిల్లాలో 1,016 మందికి అబార్షన్లు..!

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అబార్షన్ల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో 2025-26 (ఏప్రిల్ నుంచి డిసెంబర్)లో 20,824 మంది గర్భిణులుగా లెక్కల్లోకి ఎక్కారు. మొదటిసారి గర్భం దాల్చిన వారు 8,007 మందికాగా, రెండోసారి, అంతకుమించి గర్భవతులు 12,816 మంది. వీరిలో ఇప్పటి వరకు 1,016 మంది అబార్షన్లు చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇవన్నీ క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బంది గుర్తించినవి మాత్రమే.
News December 27, 2025
చిత్తూరు జిల్లాకు కొత్తగా 2472 ఇళ్లులు మంజూరు

PMAY పథకం కింద చిత్తూరు జిల్లాకు కొత్తగా 2,472 ఇళ్లులు మంజూరయ్యాయి. చిత్తూరు మున్సిపాలిటీకి 828, కుప్పం మున్సిపాలిటీకి 575, నగరి మున్సిపాలిటీకి 516, పుంగనూరు మున్సిపాలిటీకి 115, పలమనేరు మున్సిపాలిటీకి 114 ఇళ్లులు మంజూరయ్యాయి. అలాగే బైరెడ్డిపల్లికు 60, గంగవరంకు 85, పలమనేరుకు 60, పెద్దపంజాణికి 110, వీకోటకు 9 ఇళ్లులు మంజూరయ్యాయి. మొత్తం మీద పలమనేరు నియోజకవర్గానికి 438 ఇళ్లు మంజూరయ్యాయి.


