News December 31, 2024

SVU: ‘మెడికల్ దందాపై విచారణ జరపాలి’

image

SVU హెల్త్ సెంటర్ నందు గత ప్రభుత్వ హయాంలో అనేక మెడికల్ దందాలు జరిగాయని TNSF రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్కే నాయుడు, రాష్ట్ర నాయకులు చిన్న, AISF యూనివర్సిటీ అధ్యక్షులు రంజిత్ ఆరోపించారు. విద్యార్థులు ఏ అనారోగ్య సమస్యతో వెళ్లిన ఒకే రకమైన మందులు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం రిజిస్ట్రార్ భూపతి నాయుడుకి వినతి పత్రం అందజేశారు. సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Similar News

News January 13, 2025

కాలినడకన తిరుమలకు చేరుకున్న ఇండియా క్రికెటర్ 

image

భారత క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలినడకన రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు రిసెప్షన్ అధికారులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. నితీశ్ రాత్రికి తిరుమలలో బస చేసి మంగళవారం ఉదయం వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.

News January 13, 2025

తిరుపతి: కర్ణాటక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

కర్ణాటక రాయల్పాడు వద్ద ఆదివారం రాత్రి రెండు కార్లు ఢీకొనడంతో తిరుపతికి చెందిన ప్రకాశ్, కడపకు చెందిన టీచర్ మారుతి శివకుమార్ మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. తిరుపతి కట్టకిందపాలెంకు చెందిన ప్రకాశ్ (55) అశోకనగర్లో ఉండే ఆనంద్‌తో కలిసి బెంగళూరు వెళ్లాడు. ఆదివారం వారు వస్తుండగా రాయల్పాడు వద్ద కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. టీచర్ మృతదేహాన్ని శ్రీనివాసపురానికి తరలించారు.

News January 13, 2025

‘ఎస్వీయూ వీసీ పోస్ట్ బీసీలకు ఇవ్వాలి’

image

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ పోస్టును బీసీలకు ఇవ్వాలని బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ కేతే నారాయణస్వామి డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆదివారం బీసీల ఆత్మీయ సమావేశం జరిగింది. నారాయణస్వామి మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర జనాభాలో బీసీలు 60 శాతం పైగా ఉన్నారని చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు సగం కేటాయించాలని డిమాండ్ చేశారు.