News September 27, 2024

SVU: M.Tech ఫలితాలు విడుదల

image

తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో M.Tech (CBCS) 3వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

Similar News

News December 29, 2025

OFFICIAL: చిత్తూరు నుంచి పుంగనూరు ఔట్

image

చిత్తూరు జిల్లా నుంచి పుంగనూరు నియోజకవర్గాన్ని వేరు చేయడం అధికారికంగా ఖరారైంది. మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి, పుంగనూరుతో అన్నమయ్య జిల్లాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె ఉంటుంది. మరోవైపు బంగారుపాళ్యాన్ని పలమనేరు డివిజన్‌ నుంచి చిత్తూరులో కలిపారు. తిరుపతి జిల్లాలో రైల్వే కోడూరు విలీనానికి గ్రీన్ సిగ్నల్ చ్చారు. జనవరి 1 నుంచి మార్పులు అమలులోకి రానున్నాయి.

News December 29, 2025

చిత్తూరు: ఒకే రోజు రూ.1.25 కోట్ల వసూలు

image

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆదివారం విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు పనిచేశాయి. దీంతో రెండు జిల్లాల నుంచి 11,200 మంది వినియోగదారులు కరెంటు బిల్లులు చెల్లించారు. తద్వారా సంస్థకు రూ.1.25 కోట్ల ఆదాయం వచ్చిందని ఎస్ఈలు ఇస్మాయిల్ అహ్మద్, చంద్రశేఖర్ రావు తెలిపారు. సకాలంలో బిల్లులు చెల్లించి జరిమానాలకు దూరంగా ఉండాలని వినియోగదారులకు సూచించారు.

News December 29, 2025

చిత్తూరు జిల్లాలో కనపడని మామిడి పూత..!

image

చిత్తూరు జిల్లాలో మంచు ప్రభావంతో మామిడి తోటల్లో ఇంతవరకు పూత కనబడటం లేదు. ఉమ్మడి జిల్లాలో సుమారు 1.65 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నాటికి తోటల్లో మామిడి పూత వస్తుంది. ఈసారి మంచు అధికంగా ఉండటంతో ఇప్పటివరకు పూత కనిపించ లేదు. రైతులు వేలాది రూపాయలు వ్యయం చేసి మందులు పిచికారీ చేస్తున్నారు.