News May 18, 2024

స్వాతి మలివాల్ శరీరంపై నాలుగు చోట్ల గాయాలు: AIIMS

image

ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి వ్యవహారంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఆమెపై <<13262229>>దాడి<<>> నిజమేనని AIIMS వైద్యులు నిర్ధారించారు. స్వాతి ఎడమ కాలు, కుడి కన్ను కింద సహా శరీరంలోని నాలుగు భాగాలకు గాయాలయ్యాయని నివేదిక ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు స్వాతి అనధికారికంగా సీఎం నివాసంలోకి ప్రవేశించి తనపై దాడి చేశారని బిభవ్ కూడా ఫిర్యాదు చేశారు.

Similar News

News December 7, 2025

20 ఏళ్లు దాటిన తర్వాత మహిళలు ఈ టెస్టులు చేయించుకోవాలి

image

20 ఏళ్ల తర్వాత మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అందుకే మహిళలు 20 ఏళ్ల తర్వాత కొన్ని పరీక్షలు తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. HPV టెస్ట్, STD టెస్ట్​, షుగర్, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. అలాగే ఎప్పటికప్పుడు నెలసరిని వస్తుందా.. లేదా.. ఏవైనా హార్మోన్ సమస్యలున్నాయా అన్నవీ చెక్ చేసుకోవాలి. వీటితో పాటు హెల్తీ పుడ్, వ్యాయామం చేయడం మంచిదని సూచిస్తున్నారు.

News December 7, 2025

2,757 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో 2,757 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. BA, B.com, BSc, డిప్లొమా, టెన్త్, ITI, ఇంటర్ అర్హతగల వారు DEC18 వరకు NAPS/NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18- 24ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iocl.com *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News December 7, 2025

ఏపీలో 13, తెలంగాణలో 21న లోక్ అదాలత్

image

TG: వివాదాలు, కోర్టు కేసులను త్వరగా పరిష్కరించుకునేందుకు డిసెంబర్ 21న రాష్ట్రవ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ వెల్లడించింది. సివిల్, చెక్ బౌన్స్, వివాహ సంబంధ వివాదాలు, రాజీపడే అవకాశం ఉన్న క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని అధికారులు తెలిపారు. అయితే ట్రాఫిక్ చలాన్ల సెటిల్‌మెంట్ ఉండదని స్పష్టం చేశారు. అటు ఏపీలో ఈ నెల 13న లోక్ అదాలత్ జరగనుంది.