News May 16, 2024
పోలీసులకు స్వాతి మాలివాల్ ఫిర్యాదు

తనను వేధించిన ఘటనపై ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కలిసేందుకు ఆమె ఆయన నివాసానికి వెళ్లారు. స్వాతి వేచి ఉన్న గదిలోకి వెళ్లిన కేజ్రీవాల్ పీఏ.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటన దురదృష్టకరమన్న ఆప్.. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే ఇవాళ మీడియా సమావేశం సందర్భంగా కేజ్రీవాల్ను ఈ ఘటనపై ప్రశ్నించగా.. ఆయన మౌనంగా ఉండిపోయారు.
Similar News
News January 27, 2026
మున్సిపల్ ఎన్నికలు.. అభ్యర్థుల ఖర్చు ఇలా

TG: మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ అభ్యర్థులకు ₹10L, మున్సిపాలిటీలకు ₹5L వరకు వ్యయ పరిమితిని SEC ఖరారు చేసింది. మున్సిపాలిటీల్లో SC, ST, BC అభ్యర్థులు ₹1,250, ఇతరులు ₹2,500, కార్పొరేషన్లలో SC, ST, BCలు ₹2,500, ఇతరులు ₹5K నామినేషన్ డిపాజిట్ చెల్లించాలి. క్యాస్ట్ సర్టిఫికెట్ జత చేయడం తప్పనిసరి. నామినేషన్కు ముందే ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలి. అభ్యర్థుల ఖర్చులను ఈ ఖాతా ద్వారానే లెక్కిస్తారు.
News January 27, 2026
AI మ్యాజిక్.. పెళ్లి చేసుకున్న విజయ్-రష్మిక

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక పెళ్లి చేసుకున్నట్లు ఉన్న AI ఫొటోలు వైరలవుతున్నాయి. మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, సమంత, శ్రీలీల, మృణాల్ వంటి స్టార్లు ఈ పెళ్లికి హాజరైనట్లు ఫొటోలో చూపించారు. విజయ్-రష్మిక నిశ్చితార్థం జరిగిందని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని వార్తలొస్తున్న తరుణంలో వీరి అభిమానులు ఈ AI ఫొటోలు చూసి ఖుషీ అవుతున్నారు.
News January 27, 2026
దేశాన్ని రాజుల యుగంలోకి నెట్టే ప్రయత్నం: రాహుల్ గాంధీ

ఉపాధి హామీ(MGNREGA) చట్టాన్ని కేంద్రం నాశనం చేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘కార్మికుల హక్కులు, పంచాయతీలు, రాష్ట్రాల అధికారాలను హరించడం, దేశాన్ని రాజుల కాలంలోకి నెట్టడమే ప్రభుత్వ ఉద్దేశం. అలా అయితే పవర్, సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉంటుంది కదా. కనీస వేతనాలు, పనికి గ్యారంటీ, స్వేచ్ఛ, గౌరవంతో పని చేసే హక్కుతో MGNREGA తమ జీవితాలను మార్చిందని కార్మికులు అంటున్నారు.’ అని ట్వీట్ చేశారు.


