News November 13, 2024
ప్రీమియం ధరకే లిస్టైన స్విగ్గీ షేర్లు.. వెంటనే నష్టాల్లోకి

ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ స్విగ్గీ షేర్లు స్టాక్మార్కెట్లలో లిస్టయ్యాయి. IPO ధర రూ.390తో పోలిస్తే NSEలో 8% ప్రీమియంతో రూ.420, BSEలో 5.64% ప్రీమియంతో రూ.412 వద్ద నమోదయ్యాయి. గతవారం వచ్చిన ఈ IPOకు 3 రెట్ల స్పందన లభించింది. ఓవరాల్ మార్కెట్ కండిషన్ బాగాలేకపోవడంతో ఈ షేర్లు ప్రస్తుతం 4.38% నష్టంతో రూ.401 వద్ద ట్రేడవుతున్నాయి.
Similar News
News February 19, 2026
బెండలో పేనుబంక వల్ల కలిగే నష్టాలేమిటి?

బెండ పంటను పేనుబంక పురుగులు ఆశిస్తే ఆకులు, రెమ్మల నుంచి రసాన్ని పీల్చేస్తాయి. దీని వల్ల మొక్కల ఎదుగుదలపై ప్రభావం పడి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఈ పేనుబంక పురుగులు ఆకులపై తేనె వంటి జిగురు పదార్థాన్ని స్రవిస్తాయి. దీని వల్ల నల్లటి బూజు తెగులు ఆశిస్తుంది. ఫలితంగా కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం కలుగుతుంది. పేనుబంక తీవ్రత ఎక్కువగా ఉంటే ఆకులు ముడుచుకుపోయి, మొక్కలు బలహీనపడి చనిపోయే అవకాశం ఉంది.
News February 19, 2026
IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News February 19, 2026
స్నానం చేసే నీళ్లలో కాస్త రాళ్ల ఉప్పు వేస్తే..

రాళ్ల ఉప్పులో శుద్ధి చేసే గుణం ఉంటుంది. స్నానం చేసే నీటిలో కొంచెం ఉప్పు వేసుకుంటే శరీరానికి అంటుకున్న నెగటివ్ ఎనర్జీ పోతుంది. శాస్త్రీయ పరంగా.. ఉప్పు నీటి స్నానంతో చర్మ సమస్యలు తగ్గుతాయి. కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించి మనసును తేలికపరుస్తుంది. రోజంతా అలసిపోయిన వారికి ఈ ప్రక్రియ మంచి నిద్రను, ఉత్సాహాన్ని ఇస్తుంది. దిష్టి/నరఘోష ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన పరిహారం.


