News November 13, 2024
ప్రీమియం ధరకే లిస్టైన స్విగ్గీ షేర్లు.. వెంటనే నష్టాల్లోకి

ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ స్విగ్గీ షేర్లు స్టాక్మార్కెట్లలో లిస్టయ్యాయి. IPO ధర రూ.390తో పోలిస్తే NSEలో 8% ప్రీమియంతో రూ.420, BSEలో 5.64% ప్రీమియంతో రూ.412 వద్ద నమోదయ్యాయి. గతవారం వచ్చిన ఈ IPOకు 3 రెట్ల స్పందన లభించింది. ఓవరాల్ మార్కెట్ కండిషన్ బాగాలేకపోవడంతో ఈ షేర్లు ప్రస్తుతం 4.38% నష్టంతో రూ.401 వద్ద ట్రేడవుతున్నాయి.
Similar News
News February 2, 2026
VASTHU: ఇంటి ప్రాంగణంలో ఈ మొక్కలు వద్దు!

ఇంటి ప్రాంగణంలో కొన్ని రకాల చెట్లు ఉండటం అశుభమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘పాలు కారే చెట్లు ఉండొద్దు. ఇవి ధన నష్టానికి కారణమవుతాయి. ముళ్లున్న మొక్కలు శత్రుత్వానికి దారితీస్తాయని అంటారు. ఇంటికి అతి సమీపంలో నీడ పడేలా ఉండే పెద్ద చెట్లు, ఊడలు దిగే మర్రి, రావి చెట్లు పునాదులకు, వంశాభివృద్ధికి ఆటంకంగా మారుతాయి. ఎండిపోయిన, కుళ్లిపోయిన మొక్కలను వెంటనే తొలగించాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 2, 2026
బ్రాండ్లు వేరైనా.. యజమాని ఒక్కరే

మార్కెట్లో వేర్వేరు బ్రాండ్ల మధ్య పోటీ ఉందని భావిస్తాం. కానీ కొన్నిసార్లు మన డబ్బు ఒకే సంస్థ జేబులోకి వెళ్తుంది. దీన్నే మల్టీ బ్రాండింగ్ స్ట్రాటజీ అంటారు. ఉదాహరణకు అప్సర, నటరాజ్.. రెండు పెన్సిల్స్ ఒకే సంస్థవి. లక్స్, లైఫ్బాయ్ సబ్బులు కూడా హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థకు చెందినవి. ఆడి, స్కోడా కార్లు వోక్స్వ్యాగన్ గ్రూపువి. ప్రతి రకమైన కస్టమర్ను ఆకట్టుకోవడానికి కంపెనీలు ఈ స్ట్రాటజీని వాడుతాయి.
News February 2, 2026
900 మంది టీచర్ల కుటుంబాలకు జరగని న్యాయం!

AP: విధుల్లో ఉండగా 2019-2025 మధ్య అకాల మరణం పొందిన 900 మంది టీచర్ల కుటుంబాల్లో ఇంకా అంధకారం తొలగలేదు. చనిపోయిన వారి పిల్లల్లో ఒకరికి కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. కానీ ఆరేళ్లుగా అధికారులను కలుస్తున్నా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ‘6 నెలల కిందట Dy.CM పవన్ను కలవగా ఆయన CMOకు లెటర్ పంపారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


