News November 13, 2024

ప్రీమియం ధరకే లిస్టైన స్విగ్గీ షేర్లు.. వెంటనే నష్టాల్లోకి

image

ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ స్విగ్గీ షేర్లు స్టాక్‌మార్కెట్లలో లిస్టయ్యాయి. IPO ధర రూ.390తో పోలిస్తే NSEలో 8% ప్రీమియంతో రూ.420, BSEలో 5.64% ప్రీమియంతో రూ.412 వద్ద నమోదయ్యాయి. గతవారం వచ్చిన ఈ IPOకు 3 రెట్ల స్పందన లభించింది. ఓవరాల్ మార్కెట్ కండిషన్ బాగాలేకపోవడంతో ఈ షేర్లు ప్రస్తుతం 4.38% నష్టంతో రూ.401 వద్ద ట్రేడవుతున్నాయి.

Similar News

News February 14, 2026

టాపార్డర్ ఓకే.. వీళ్లు కూడా రాణిస్తే!

image

T20 WCలో వరుసగా రెండు మ్యాచులు గెలిచిన టీ‌మ్ ఇండియాకు బ్యాటర్ల నిలకడలేమి ఆందోళన కలిగిస్తోంది. ఇషాన్, సూర్య, హార్దిక్ రాణిస్తున్నా మిడిలార్డర్‌లో తిలక్, దూబే, రింకూ, ఆల్‌రౌండర్ అక్షర్ ఇంకా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. రేపు పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ భారత్‌కు చాలా కీలకం. ఈ మ్యాచులోనైనా వీరు గాడిలో పడితే భారత్‌కు మరింత ప్రయోజనం చేకూరడంతో పాటు టాపార్డర్ మీద భారం తగ్గనుంది.

News February 14, 2026

అరటిలో పిలకల తొలగింపుతో అధిక దిగుబడి

image

అరటి పంట నాటిన 3-4 నెలల తర్వాత పిలకలు వృద్ధి చెందుతాయి. అరటి గెల సగం తయారయ్యే వరకు పిలకలను 20-25 రోజులకొకసారి కోసి వేయాలి. ఇలా చేయడం వల్ల తల్లి చెట్లు బలంగా ఎదిగి అధిక ఫలసాయం అందిస్తుంది. బాగా పెద్దవైన పిలకలను వెడల్పాటి పదునైన గునపంతో కొద్దిపాటి దుంపతో సహ తవ్వితీస్తే తిరిగి ఎదగదు. ఒకవేళ అరటిలో 2వ పంట తీసుకోవాలంటే తల్లి చెట్టుకు దూరంగా ఉన్న ఆరోగ్యవంతమైన పిలకను ఎన్నుకొని మిగతా వాటిని తీసివేయాలి.

News February 14, 2026

రేపు శివలింగానికి అభిషేకం చేస్తున్నారా?

image

శివరాత్రి రోజున శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే మరింత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘భక్తులు దక్షిణ/తూర్పు దిశలో నిలబడి, ఉత్తర/పడమర దిశగా చూస్తూ అభిషేకం చేయాలి. రాగి, వెండి, కంచు పాత్రలు శ్రేష్ఠం. నీటి ధార విడవకుండా, నిరంతరంగా పడేలా అభిషేకించాలి. శివ పంచాక్షరీ మంత్రం జపించాలి. అభిషేకం పూర్తయ్యాక ప్రదక్షిణ చేయకూడదు. తూర్పును చూస్తూ అభిషేకం నిషిద్ధం’ అంటున్నారు.