News November 13, 2024
ప్రీమియం ధరకే లిస్టైన స్విగ్గీ షేర్లు.. వెంటనే నష్టాల్లోకి

ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ స్విగ్గీ షేర్లు స్టాక్మార్కెట్లలో లిస్టయ్యాయి. IPO ధర రూ.390తో పోలిస్తే NSEలో 8% ప్రీమియంతో రూ.420, BSEలో 5.64% ప్రీమియంతో రూ.412 వద్ద నమోదయ్యాయి. గతవారం వచ్చిన ఈ IPOకు 3 రెట్ల స్పందన లభించింది. ఓవరాల్ మార్కెట్ కండిషన్ బాగాలేకపోవడంతో ఈ షేర్లు ప్రస్తుతం 4.38% నష్టంతో రూ.401 వద్ద ట్రేడవుతున్నాయి.
Similar News
News February 5, 2026
భర్తకు ఎడమవైపునే భార్య.. ఎందుకంటే?

హిందూ సంప్రదాయంలో భార్యను భర్తకు ఎడమ వైపున ఉండాలని చెబుతుంటారు. దీనికి ప్రధాన కారణం శివపార్వతుల అర్ధనారీశ్వర తత్వం. పురాణాల ప్రకారం పరమశివుని శరీరంలో ఎడమ భాగం పార్వతీదేవి ఉంటారు. దీంతోపాటు గుండె ఎడమ వైపున ఉండటంతో భార్య భర్త మనసుకి దగ్గరగా ఉండాలని దీని అంతరార్థం. అందుకే పూజలు, శుభకార్యాల్లో భార్య భర్తకు ఎడమ వైపునే కూర్చుని ధర్మకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది.
News February 5, 2026
దేవుడి నెయ్యే ఇలా ఉంటే.. మార్కెట్లో పరిస్థితేంటి?

AP: ‘TTD నెయ్యి కల్తీ’ కలకలం రేపుతుండగా ఇతర టెంపుల్స్లోనూ ఇలా జరిగిందేమోనన్న అనుమానాలు వస్తున్నాయి. శ్రీశైలం గుడికీ కల్తీ నెయ్యి వెళ్లిందని సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా భోలే బాబా కంపెనీ ఏ రాష్ట్రాల్లో కల్తీ నెయ్యి సరఫరా చేసింది? ఇలాంటి సంస్థలు ఇంకెన్ని ఉండొచ్చు అన్న చర్చ సాగుతోంది. దేవుడి నెయ్యికే ఇలా చేస్తే ఇక మార్కెట్లో అమ్మే దాన్ని ఎలా తయారు చేస్తున్నారో అన్న సందేహాలూ ఏర్పడుతున్నాయి.
News February 5, 2026
నీటి సంఘాలకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం: CM

AP: అనుమతి తీసుకోని ‘రాయలసీమ’ లిఫ్ట్ను NGT ఆపేస్తే దానిద్వారా ప్రజలను మభ్యపెట్టేందుకు YCP యత్నిస్తోందని CM CBN విమర్శించారు. ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు ద్వారా తాము నీళ్లిస్తామని చెప్పారు. ‘గోదావరి నీరు వృథాగా పోతోంది. అందులోని 200 TMCలు నల్లమలసాగర్కు తరలిస్తాం. 2014-19 మధ్య నీటి సంఘాలు చేపట్టిన పనులకు గత GOVT బిల్లులు ఇవ్వలేదు. వాటిని చెల్లిస్తాం. ఇకపై పనులు వాటికే ఇస్తాం’ అని CM తెలిపారు.


