News November 13, 2024
ప్రీమియం ధరకే లిస్టైన స్విగ్గీ షేర్లు.. వెంటనే నష్టాల్లోకి

ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ స్విగ్గీ షేర్లు స్టాక్మార్కెట్లలో లిస్టయ్యాయి. IPO ధర రూ.390తో పోలిస్తే NSEలో 8% ప్రీమియంతో రూ.420, BSEలో 5.64% ప్రీమియంతో రూ.412 వద్ద నమోదయ్యాయి. గతవారం వచ్చిన ఈ IPOకు 3 రెట్ల స్పందన లభించింది. ఓవరాల్ మార్కెట్ కండిషన్ బాగాలేకపోవడంతో ఈ షేర్లు ప్రస్తుతం 4.38% నష్టంతో రూ.401 వద్ద ట్రేడవుతున్నాయి.
Similar News
News February 23, 2026
ఎత్తయిన ప్రదేశాల్లో తక్కువగా డయాబెటిస్ ముప్పు.. కారణమిదే

సముద్రమట్టం కంటే అధిక ఎత్తయిన ప్రదేశాల్లో నివసించే వారికి డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని గ్లాడ్స్టోన్ ఇన్స్టిట్యూట్స్(US) సైంటిస్టులు కనుగొన్నారు. ‘ఆ ప్రాంతాల్లో ఆక్సిజన్ స్థాయులు తక్కువగా ఉండటం వల్ల ఎర్ర రక్తకణాలు మెటబాలిక్ మోడ్లోకి మారి పెద్దమొత్తంలో గ్లూకోజ్ను గ్రహిస్తాయి. తక్కువ ఆక్సిజన్తోనే శరీరం మనుగడ సాధిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయులూ తగ్గుతాయి’ అని పేర్కొన్నారు.
News February 23, 2026
పురుషులు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?

మొలతాడును ఓ సంప్రదాయమే అనుకుంటే పొరపాటే! దీని వెనుక ఆరోగ్య రహస్యాలున్నాయి. పిల్లల్లో హెర్నియా సమస్యలు రాకుండా ఇది రక్షణగా నిలుస్తుంది. శరీరంలో వచ్చే మార్పులను, పొట్ట పెరుగుదలను హెచ్చరిస్తుంది. పూర్వం గోచి ధరించడానికి ఇది ప్రధానాధారం. సామాజికంగా ‘మొలతాడు కట్టిన మగాడివైతే’ అనే సవాలు ఆ వ్యక్తి వివాహానికి అర్హుడైన పురుషుడనే గుర్తింపును సూచిస్తుంది. స్త్రీలకు కూడా చిన్నతనంలో మొలనూలు ధరించే ఆచారం ఉంది.
News February 23, 2026
ఇంజినీరింగ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇంటర్వ్యూతో హైదరాబాద్లో 200 ఉద్యోగాలు

HYDలోని <


