News November 13, 2024
ప్రీమియం ధరకే లిస్టైన స్విగ్గీ షేర్లు.. వెంటనే నష్టాల్లోకి

ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ స్విగ్గీ షేర్లు స్టాక్మార్కెట్లలో లిస్టయ్యాయి. IPO ధర రూ.390తో పోలిస్తే NSEలో 8% ప్రీమియంతో రూ.420, BSEలో 5.64% ప్రీమియంతో రూ.412 వద్ద నమోదయ్యాయి. గతవారం వచ్చిన ఈ IPOకు 3 రెట్ల స్పందన లభించింది. ఓవరాల్ మార్కెట్ కండిషన్ బాగాలేకపోవడంతో ఈ షేర్లు ప్రస్తుతం 4.38% నష్టంతో రూ.401 వద్ద ట్రేడవుతున్నాయి.
Similar News
News February 27, 2026
ఉత్తరాంధ్రకు భారీ ఫార్మా సంస్థ: లోకేశ్

AP: కూటమి పాలనలో ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి లోకేశ్ తెలిపారు. రేపు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్కులో ప్రముఖ ఫార్మా సంస్థ ‘బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్’కు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. రూ.2,300 కోట్ల పెట్టుబడితో 1,750 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు. 2028-29 FYకు సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించనుందని వివరించారు.
News February 27, 2026
అభిషేక్ పోస్ట్.. చెప్పు చూపించిన యువీ!

T20WC: నిన్నటి మ్యాచ్లో రాణించడాన్ని యువ క్రికెటర్ అభిషేక్ శర్మ ఇన్స్టా పోస్ట్తో సెలబ్రేట్ చేసుకోగా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తనదైన శైలిలో స్పందించారు. అభిషేక్ పోస్టుకు సరదాగా ఓ చెప్పు ఎమోజీని పెట్టారు. గతంలోనూ యువీ అభిషేక్కు ఈ తరహా ఎమోజీలు పెట్టారు. ఆటపై మరింత దృష్టిపెట్టాలని హెచ్చరించడమే దీని ఉద్దేశం. మరోవైపు అభిషేక్ ప్రదర్శనను మెచ్చుకుంటూ ఇన్స్టాలో యువరాజ్ స్టోరీ పోస్ట్ చేశారు.
News February 27, 2026
తడబడిన న్యూజిలాండ్.. స్కోర్ ఎంతంటే?

T20WC: ENGతో జరుగుతున్న మ్యాచులో న్యూజిలాండ్ తడబడింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 రన్స్ చేసింది. సీఫర్ట్ 35, అలెన్ 29, ఫిలిప్స్ 39 రన్స్ చేశారు. మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు. రషీద్, జాక్స్, రెహన్ అహ్మద్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచులో ENG గెలిస్తే పాకిస్థాన్ సెమీస్ వెళ్లడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ NZ గెలిస్తే పాక్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది.


