News November 13, 2024

ప్రీమియం ధరకే లిస్టైన స్విగ్గీ షేర్లు.. వెంటనే నష్టాల్లోకి

image

ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ స్విగ్గీ షేర్లు స్టాక్‌మార్కెట్లలో లిస్టయ్యాయి. IPO ధర రూ.390తో పోలిస్తే NSEలో 8% ప్రీమియంతో రూ.420, BSEలో 5.64% ప్రీమియంతో రూ.412 వద్ద నమోదయ్యాయి. గతవారం వచ్చిన ఈ IPOకు 3 రెట్ల స్పందన లభించింది. ఓవరాల్ మార్కెట్ కండిషన్ బాగాలేకపోవడంతో ఈ షేర్లు ప్రస్తుతం 4.38% నష్టంతో రూ.401 వద్ద ట్రేడవుతున్నాయి.

Similar News

News February 21, 2026

అలాంటి వారిని పార్టీ నుంచి పంపిస్తే నష్టం: రేవంత్

image

TG: భిన్నాభిప్రాయలు చెప్పేవారు ఉంటారని, అలాంటి వారిని పార్టీ నుంచి పంపిస్తే నష్టమని CM రేవంత్ తెలిపారు. ‘అందరం కలిసి పని చేస్తేనే అనుకున్నది సాధిస్తాం. గాంధీ సిద్ధాంతాలను విశ్వసించే పార్టీ కాంగ్రెస్. డిజిటల్ మెంబర్‌షిప్‌పై దృష్టిపెట్టాలి. DCCలుగా పని చేసినవారికే MLA టికెట్లు ఇచ్చాం’ అని అనంతగిరి సభలో అన్నారు. <<19135982>>రాజగోపాల్ రెడ్డి <<>>వ్యాఖ్యల నేపథ్యంలోనే CM పైవిధంగా స్పందించినట్లు తెలుస్తోంది.

News February 21, 2026

YSR వారసత్వాన్ని జగన్ దిగజారుస్తున్నారు: యూత్ కాంగ్రెస్

image

ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ తీరు దేశాన్ని కించపరిచేలా ఉందని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. రాజకీయాల కంటే దేశ ప్రతిష్ఠ ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. దీనిపై యూత్ కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. YSR వారసత్వాన్ని జగన్ దిగజారుస్తున్నారని, CID/ED కేసుల భయంతోనే ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రి ఆశయాలను వదిలేశారని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.

News February 21, 2026

AUSWపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

image

అడిలైడ్ వేదికగా జరిగిన <<19201544>>మూడో టీ20లో<<>> ఆస్ట్రేలియా మహిళల జట్టుపై 17 రన్స్ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆసీస్ గడ్డపై భారత్‌కు ఇదే తొలి సిరీస్ విజయం. ఈ మ్యాచ్‌లో 177 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఆసీస్‌ను 159/9 స్కోరుకే పరిమితం చేసింది. ఆష్లీ గార్డనర్ 57, లిచ్‌ఫీల్డ్ 26 మినహా అందరూ విఫలమయ్యారు. శ్రీచరణి, శ్రేయాంక చెరో 3, అరుంధతి 2, రేణుక ఒక వికెట్ తీశారు.