News November 13, 2024
ప్రీమియం ధరకే లిస్టైన స్విగ్గీ షేర్లు.. వెంటనే నష్టాల్లోకి

ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ స్విగ్గీ షేర్లు స్టాక్మార్కెట్లలో లిస్టయ్యాయి. IPO ధర రూ.390తో పోలిస్తే NSEలో 8% ప్రీమియంతో రూ.420, BSEలో 5.64% ప్రీమియంతో రూ.412 వద్ద నమోదయ్యాయి. గతవారం వచ్చిన ఈ IPOకు 3 రెట్ల స్పందన లభించింది. ఓవరాల్ మార్కెట్ కండిషన్ బాగాలేకపోవడంతో ఈ షేర్లు ప్రస్తుతం 4.38% నష్టంతో రూ.401 వద్ద ట్రేడవుతున్నాయి.
Similar News
News March 2, 2026
ఖమేనీ మృతి: భారత్ ఎందుకు సంతాపం ప్రకటించలేదు?

ఖమేనీ మృతిపై భారత్ మౌనం వెనక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కశ్మీర్, ఢిల్లీ అల్లర్ల వంటి విషయాల్లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇరాన్ దాడులకు గురవుతున్న గల్ఫ్ దేశాలతో ఉన్న క్లోజ్ రిలేషన్స్, అమెరికా వంటి అగ్రరాజ్యాల వైఖరిని దృష్టిలో ఉంచుకొని భారత్ సైలెంట్గా ఉందని నిపుణులు వివరిస్తున్నారు. అందుకే సంతాపం తెలపడం కంటే శాంతి చర్చలకు పిలుపునిచ్చినట్లు విశ్లేషిస్తున్నారు.
News March 2, 2026
రేపు HYDలో లిక్కర్ షాపులు బంద్

హోలీ నేపథ్యంలో హైదరాబాద్లో మార్చి 3న లిక్కర్ షాపులను మూసివేయాలని CP సజ్జనార్ ఆదేశించారు. 6AM నుంచి 6PM వరకు లిక్కర్, కల్లు దుకాణాలు, బార్లు మూసేయాలని, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే మార్చి 2 నుంచి 4 వరకు ఎవరిపైనా బలవంతంగా రంగులు చల్లవద్దని స్పష్టం చేశారు. వాహనాలపై గుంపులుగా వెళ్తూ న్యూసెన్స్ చేసినా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
News March 2, 2026
TGలో BJP మోడల్ ‘బుల్డోజర్ రాజ్’: కేరళ CM

తెలంగాణలోని INC ప్రభుత్వం BJP మోడల్ బుల్డోజర్ రాజ్ను నడిపిస్తోందని కేరళ CM పినరయి విజయన్ విమర్శించారు. ఖమ్మంలోని భూదాన్ భూముల్లో నిర్మించుకున్న దాదాపు 700ఇళ్లను GOVT కూల్చివేయడంపై ఆయన Xలో ఫైరయ్యారు. ‘3వేల మంది పేదలను నిరాశ్రయుల్ని చేసి INC తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. పేదలను పీడించే బీజేపీ విధానాలను అనుసరిస్తోంది. పేదలపై చేస్తున్న ఈ దాడికి ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.


