News November 13, 2024
ప్రీమియం ధరకే లిస్టైన స్విగ్గీ షేర్లు.. వెంటనే నష్టాల్లోకి

ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ స్విగ్గీ షేర్లు స్టాక్మార్కెట్లలో లిస్టయ్యాయి. IPO ధర రూ.390తో పోలిస్తే NSEలో 8% ప్రీమియంతో రూ.420, BSEలో 5.64% ప్రీమియంతో రూ.412 వద్ద నమోదయ్యాయి. గతవారం వచ్చిన ఈ IPOకు 3 రెట్ల స్పందన లభించింది. ఓవరాల్ మార్కెట్ కండిషన్ బాగాలేకపోవడంతో ఈ షేర్లు ప్రస్తుతం 4.38% నష్టంతో రూ.401 వద్ద ట్రేడవుతున్నాయి.
Similar News
News March 2, 2026
అదే నిజమైతే మరో రికార్డ్!

ధురంధర్-2 రన్టైమ్పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం నిడివి 3 గంటల 55 నిమిషాలు ఉంటుందని సమాచారం. ఒకవేళ అదే నిజమైతే బాలీవుడ్లో గత 26ఏళ్లలో లాంగెస్ట్ రన్టైమ్ ఉన్న రెండో సినిమాగా నిలుస్తుంది. కాగా LOC కార్గిల్ 4 గంటల ఏడు నిమిషాలతో మొదటి స్థానంలో ఉంది. ఈనెల 19న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను హోలీ సందర్భంగా రేపు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News March 2, 2026
విండీస్పై విజయం.. భారత్ కొత్త రికార్డులు

T20WC: వెస్ట్ఇండీస్పై విజయంతో సెమీస్కు దూసుకెళ్లిన భారత్ ఈ మ్యాచ్తో కొత్త రికార్డులు నమోదు చేసుకుంది. 196 పరుగల లక్ష్యాన్ని ఛేదించడంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే భారత్ తన హైయెస్ట్ సక్సస్ఫుల్ ఛేజ్ నమోదు చేసింది. అలాగే ఇంగ్లండ్, సౌతాఫ్రికా తర్వాత అతిపెద్ద టోటల్ను ఛేజ్ చేసిన మూడో జట్టుగా నిలిచింది. T20WCలో సెమీస్కు ఆరుసార్లు క్వాలిఫై అయిన జట్టుగా ఇంగ్లండ్, పాక్ సరసన నిలిచింది.
News March 2, 2026
డీల్కు అతి చేరువలో ఉండగా US దాడి చేసింది: ఇరాన్ మంత్రి

అణు ఒప్పందానికి అతి చేరువలో ఉండగా US దాడులు చేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయిద్ అబ్బాస్ అరాఘ్చి విమర్శించారు. చర్చలు జరుగుతుండగానే దాడులు చేసి దౌత్యాన్ని ట్రంప్ నాశనం చేశారన్నారు. చివరగా జెనీవాలో చర్చలు జరిగాక వచ్చే సమావేశంలో ఈ డీల్ ఖాయం చేసుకోవాలని అనుకున్నామని తెలిపారు. కాగా ఇరాన్ డీల్కు సుముఖంగానే ఉన్నా ట్రంప్ కావాలనే దాడులు చేయించినట్లు వెస్ట్ మీడియాలో పలు ఆరోపణలు వస్తున్నాయి.


