News November 13, 2024
ప్రీమియం ధరకే లిస్టైన స్విగ్గీ షేర్లు.. వెంటనే నష్టాల్లోకి

ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ స్విగ్గీ షేర్లు స్టాక్మార్కెట్లలో లిస్టయ్యాయి. IPO ధర రూ.390తో పోలిస్తే NSEలో 8% ప్రీమియంతో రూ.420, BSEలో 5.64% ప్రీమియంతో రూ.412 వద్ద నమోదయ్యాయి. గతవారం వచ్చిన ఈ IPOకు 3 రెట్ల స్పందన లభించింది. ఓవరాల్ మార్కెట్ కండిషన్ బాగాలేకపోవడంతో ఈ షేర్లు ప్రస్తుతం 4.38% నష్టంతో రూ.401 వద్ద ట్రేడవుతున్నాయి.
Similar News
News February 26, 2026
ఇండియా-జింబాబ్వే మ్యాచ్.. ‘డ్యూ’ రాకుండా ఏం చేశారంటే..?

T20 WC సూపర్-8లో ఇండియా-జింబాబ్వే మధ్య చెన్నైలో మరికొన్ని గంటల్లో కీలక పోరు జరగనుంది. డ్యూ(మంచు) ప్రభావం ఉండకుండా తేమను నియంత్రించే ప్రత్యేక రసాయనాన్ని గ్రౌండ్లో స్ప్రే చేశారు. ఇందుకోసం ‘డ్యూ క్యూర్’ కెమికల్ను US నుంచి తెప్పించారని తెలుస్తోంది. డ్యూ వల్ల బంతి స్కిడ్ అయి సెకండ్ ఇన్నింగ్స్లో ఫీల్డింగ్ చేసే జట్టు ఇబ్బంది పడుతుంది. అలా జరగొద్దని కెమికల్ స్ప్రే చేశారు. మరి అదెలా పని చేస్తుందో!
News February 26, 2026
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News February 26, 2026
ఎందుకలా?!: షుగర్ ఉన్నవారిలో తరచూ నీరసం..

షుగర్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయులు అధికంగా ఉన్నా అవయవాల్లోని కణాలకు అవసరమైన శక్తి అందక నీరసంగా అన్పిస్తుంది. దీనికి కారణం ఇన్సులిన్ అనే హార్మోన్ పని చేయకపోవడం. ఇన్సులిన్ను క్లోమం ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించి కణాలకు శక్తిని అందిస్తుంది. శరీరంలో ఇది తగినంత ఉత్పత్తి కాకపోతే రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి డయాబెటిస్కు దారి తీస్తుంది. ప్రతిరోజూ 4pmకు ఎందుకలా?!.


