News November 13, 2024
ప్రీమియం ధరకే లిస్టైన స్విగ్గీ షేర్లు.. వెంటనే నష్టాల్లోకి

ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ స్విగ్గీ షేర్లు స్టాక్మార్కెట్లలో లిస్టయ్యాయి. IPO ధర రూ.390తో పోలిస్తే NSEలో 8% ప్రీమియంతో రూ.420, BSEలో 5.64% ప్రీమియంతో రూ.412 వద్ద నమోదయ్యాయి. గతవారం వచ్చిన ఈ IPOకు 3 రెట్ల స్పందన లభించింది. ఓవరాల్ మార్కెట్ కండిషన్ బాగాలేకపోవడంతో ఈ షేర్లు ప్రస్తుతం 4.38% నష్టంతో రూ.401 వద్ద ట్రేడవుతున్నాయి.
Similar News
News February 20, 2026
ఐటీ రైడ్లో సీక్రెట్ రూమ్.. రూ.కోట్ల విలువైన బంగారం!

బాలీవుడ్ సినిమా ‘రైడ్’ తరహా ఘటన రాజస్థాన్లో జరిగింది. కన్హా గ్రూప్పై రూ.100 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలతో ఐటీ అధికారులు 6 నగరాల్లో 3 రోజులుగా సోదాలు చేస్తున్నారు. ఇవాళ ఓ చోట సీక్రెట్ రూమ్ బయటపడింది. దాన్ని బద్దలుకొట్టి చూడగా రూ.కోట్ల విలువైన గోల్డ్ కనిపించింది. దాని విలువ ఎంత అనేది త్వరలో వెల్లడికానుంది. ఇప్పటి వరకు ₹50L నగదు, 10 బ్యాంక్ లాకర్లు, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
News February 20, 2026
‘PhonePe’లో అదిరిపోయే ఫీచర్!

డిజిటల్ పేమెంట్స్ యాప్ ‘PhonePe’ ఇంట్రెస్టింగ్ ఫీచర్ను తీసుకొచ్చింది. యాప్ గురించి సరిగ్గా అవగాహన లేనివాళ్లు కూడా ఈజీగా వినియోగించేలా AI-ఆధారిత సెర్చ్ ఫీచర్ను ప్రారంభించింది. దీనిద్వారా యూజర్లు టెక్స్ట్ లేదా వాయిస్ కమాండ్లతో పేమెంట్స్, రీఛార్జ్ వంటివి చేయొచ్చు. ఉదాహరణకు ‘FASTag రీఛార్జ్’ అని టైప్ చేస్తే నేరుగా ఆ పేజీకి తీసుకెళ్తుంది. ఇది డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయనుంది. SHARE IT.
News February 20, 2026
4.43 నిమిషాల భేటీ… ఖర్చు రూ.17 లక్షలు

AP: సమస్యలపై చర్చించాల్సిన శాసనమండలి రెండు రోజులుగా TTD లడ్డూపై రాద్ధాంతంతో పట్టుమని 10 ని.లూ నడవడం లేదు. ఇవాళ మరీ దారుణం. ఉ.10కి ప్రారంభమైన మండలి సభ్యుల ఆందోళనలతో ఛైర్మన్ మోషేన్ రాజు 4.03 ని.ల లోపే సభను వాయిదా వేశారు. 2 గంటల అనంతరం సభ తిరిగి ప్రారంభమైనా అదే గందరగోళం కొనసాగడంతో 40 సెకన్లలోనే ముగించారు. GOVT గణాంకాల ప్రకారం ఒకరోజు పూర్తిగా సభ నిర్వహణకు రూ.17 లక్షల వరకు ప్రజాధనం ఖర్చవుతోంది.


