News July 15, 2024
కేటీఆర్కు T కాంగ్రెస్ కౌంటర్

TG: రాష్ట్రంలోనూ బస్సు ఛార్జీలు పెంచే అవకాశం ఉందన్న కేటీఆర్ <<13631469>>ట్వీట్పై<<>> T కాంగ్రెస్ ఘాటుగా బదులిచ్చింది. ‘మీ తండ్రి దళితులకు మూడెకరాలు భూమి ఫ్రీ, బీసీ బంధు, రైతులకు ఉచితంగా 26 లక్షల టన్నులు ఎరువులు, దళిత బంధు ఫ్రీ, పేదలకు ఉచిత డబుల్ బెడ్ రూమ్లు ఇస్తా అన్నాడు. ప్రతి పథకంలో అరచేతిలో బెల్లం పెట్టి మోచేయి నాకించాడు. పదేళ్ల పాలనను ఎందుకు పదే పదే గుర్తు చేస్తావ్’ అని కేటీఆర్కు కౌంటరిచ్చింది.
Similar News
News January 27, 2026
ఈయూతో డీల్.. వీటి ధరలు తగ్గుతాయి

ఇండియా-EU మధ్య ఫ్రీ ట్రేడ్ డీల్ <<18971975>>కుదిరిన<<>> విషయం తెలిసిందే. దీంతో EU దేశాల నుంచి వచ్చే 96.6% వస్తువులపై సుంకాలు ఉండవు/తగ్గుతాయి. పలు కార్లు, ఆలివ్ ఆయిల్, కివీస్, స్పిరిట్స్ (విస్కీ, వోడ్కా వంటివి), బీర్, వైన్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రూట్ జ్యూస్ ధరలు దిగొస్తాయి. ఈ డీల్తో 90%పైగా భారత ఉత్పత్తులకు యూరప్ మార్కెట్లో సుంకాలు ఉండవని తెలుస్తోంది. టెక్స్టైల్స్, కెమికల్స్, జువెలరీ రంగాలకు సపోర్ట్ దక్కనుంది.
News January 27, 2026
డీసీసీబీల్లోనూ యూపీఐ సేవలు

AP: రాష్ట్రంలోని అన్ని డీసీసీబీల్లో త్వరలోనే UPI సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయోగాత్మకంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని సహకార బ్యాంకుల్లో నిన్న ఈ సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ బ్యాంకుల్లో ఎక్కువగా ఖాతాలు కలిగిన రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఇకపై ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్ల ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. కాగా ప్రస్తుతం వాణిజ్య బ్యాంకుల్లోనే ఈ సేవలు ఉన్న విషయం తెలిసిందే.
News January 27, 2026
మంత్రులతో భేటీకి కారణమిదే: భట్టి

TG: మున్సిపల్ ఎన్నికల్లో GPల కంటే మెరుగైన ఫలితాలు వస్తాయని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్లో భేటీలో మంత్రులు పరిపాలన, ఎన్నికలకు సంబంధించి మాట్లాడారని చెప్పారు. సీఎం అందుబాటులో లేకపోవడంతో తనతో మాట్లాడి నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. సీఎం, మంత్రులందరం సమష్టిగా పనిచేస్తున్నామన్నారు. సింగరేణిలో అవినీతి జరగలేదని, ఏమైనా అనుమానాలు ఉంటే లేఖ రాస్తే విచారణ చేయిస్తామని తెలిపారు.


