News January 25, 2026
T20 WC నుంచి ఔట్.. BCB వివరణ ఇదే

T20 WC నుంచి వైదొలగడం అనేది తమ దేశ ప్రభుత్వ నిర్ణయమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ అమ్జద్ హొస్సేన్ తెలిపారు. ‘మేం ఆడాలనుకున్నాం. కానీ భారత్లో ఆడటం సేఫ్ కాదని ప్రభుత్వం వద్దని చెప్పింది. ప్రతి టూర్కు ప్రభుత్వ క్లియరెన్స్ తప్పనిసరి’ అని అమ్జద్ వివరించారు. ‘మ్యాచులు జరిగే ఓ సిటీ(కోల్కతా) నుంచి మాకు బెదిరింపులు వచ్చాయి. అందుకే అక్కడ ఆడటం సేఫ్ కాదని అనిపించింది’ అని పేర్కొన్నారు.
Similar News
News February 21, 2026
YSR వారసత్వాన్ని జగన్ దిగజారుస్తున్నారు: యూత్ కాంగ్రెస్

ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ తీరు దేశాన్ని కించపరిచేలా ఉందని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. రాజకీయాల కంటే దేశ ప్రతిష్ఠ ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. దీనిపై యూత్ కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. YSR వారసత్వాన్ని జగన్ దిగజారుస్తున్నారని, CID/ED కేసుల భయంతోనే ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రి ఆశయాలను వదిలేశారని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.
News February 21, 2026
AUSWపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

అడిలైడ్ వేదికగా జరిగిన <<19201544>>మూడో టీ20లో<<>> ఆస్ట్రేలియా మహిళల జట్టుపై 17 రన్స్ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 2-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఆసీస్ గడ్డపై భారత్కు ఇదే తొలి సిరీస్ విజయం. ఈ మ్యాచ్లో 177 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన ఆసీస్ను 159/9 స్కోరుకే పరిమితం చేసింది. ఆష్లీ గార్డనర్ 57, లిచ్ఫీల్డ్ 26 మినహా అందరూ విఫలమయ్యారు. శ్రీచరణి, శ్రేయాంక చెరో 3, అరుంధతి 2, రేణుక ఒక వికెట్ తీశారు.
News February 21, 2026
ట్రంప్కు బొమ్మ చూపించాడు!

విదేశాలపై టారిఫ్స్ వేసే అధికారం USA అధ్యక్షుడికి లేదని ఆ దేశ సుప్రీంకోర్టు చెప్పడం తెలిసిందేగా. USAలోని చిన్న బొమ్మల కంపెనీ ఓనర్ రిక్ ఈ తీర్పు కోసం పోరాడారు. తన లెర్నింగ్ రిసోర్సెస్ లిమిటెడ్ కంపెనీ చైనా నుంచి టాయ్స్ కొని USAలో వ్యాపారం చేస్తుంది. ట్రంప్ టారిఫ్స్తో నష్టపోయిన రిక్, తనలాంటి వ్యాపారులతో కలిసి కోర్టుకెళ్లి కేసు గెలిచారు. తమ నుంచి వసూలు చేసిన అదనపు సుంకం ఇవ్వాలనేది రిక్ తాజా డిమాండ్.


