News September 10, 2025
టీ20 WC-2026 షెడ్యూల్ ఖరారు?

వచ్చే ఏడాది భారత్, శ్రీలంక హోస్ట్ చేయనున్న ICC మెన్స్ T20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నీ జరగనున్నట్లు ESPNCricinfo పేర్కొంది. 20 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో మొత్తం 55 మ్యాచులు జరగనున్నాయి. మొత్తం 5 వేదికల్లో (భారత్లో 3, శ్రీలంక లో 2) నిర్వహించనున్నారు. పాకిస్థాన్ క్వాలిఫికేషన్ను బట్టి ఫైనల్ను అహ్మదాబాద్ లేదా కొలొంబోలో నిర్వహిస్తారని సమాచారం.
Similar News
News March 13, 2026
‘కుక్కపిల్లలా ట్రంప్’.. కాలిఫోర్నియా గవర్నర్ పోస్ట్ వైరల్

ట్రంప్పై కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయం చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. చమురు సంక్షోభం వేళ రష్యన్ ఆయిల్ను కొనేందుకు ట్రంప్ ప్రపంచ దేశాలకు APR 11 వరకు పర్మిషన్ ఇచ్చారు. దీంతో రష్యాకు భారీగా లబ్ధి చేకూరనుంది. ఈ క్రమంలో పుతిన్ ట్రంప్ను పెంపుడు కుక్కపిల్లలా కట్టేసి లాక్కెళ్తున్నట్లు ఉన్న ఎడిటెడ్ ఫొటోను గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేసింది. కాగా ట్రంప్ రిపబ్లికన్, గవర్నర్ న్యూసమ్ డెమోక్రటిక్.
News March 13, 2026
శుక్రవారం రోజున జన్మిస్తే..

శుక్రవారం నాడు జన్మించినవారిపై శుక్రుడి ప్రభావం ఉంటుందని జ్యోతిషులు చెబుతున్నారు. ‘వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, అపార సంపద గల యోగాన్ని కలిగి ఉంటారు. కష్టపడితే స్వయంకృషితోనే గొప్ప స్థాయికి చేరుకునే అదృష్టం ఉంటుంది. సినిమా, మీడియా రంగాల్లో రాణిస్తారు. 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారికి ఇంకా మంచి ఫలితాలుంటాయి. వీరు రాజరాజేశ్వరి దేవిని ఆరాధించాలి. లలితా సహస్రనామ పారాయణం చేయాలి’ అని సూచిస్తున్నారు.
News March 13, 2026
SMలో పోర్నోగ్రఫీకి పిల్లలు బలి.. హర్భజన్ ఆవేదన

సోషల్ మీడియా ప్రభావం చిన్నపిల్లలపై తీవ్రంగా పడుతోందని మాజీ క్రికెటర్, ఎంపీ హర్భజన్ సింగ్ రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు. అందులో విస్తృతంగా లభించే అసభ్యకర, పోర్నోగ్రఫీకి 12-13 ఏళ్ల పిల్లలు బలి అవుతున్నారని, వారి భవిష్యత్తు నాశనమవుతోందని పేర్కొన్నారు. యువతను సంరక్షించేందుకు వీలుగా డిజిటల్ ప్లాట్ఫామ్స్ వాడకంపై కఠిన ఆంక్షలు విధించాలని కేంద్రానికి సూచించారు.


