News April 18, 2024

T20 WC: దూబేపై ‘ఇంపాక్ట్’ దెబ్బ!

image

CSK ఆల్‌రౌండర్ శివమ్ దూబే T20 WC ఆడే భారత జట్టులో ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడిని ‘ఇంపాక్ట్’ రోల్ కలవరపెడుతోంది. 6మ్యాచుల్లో 242రన్స్‌తో CSK టాప్ స్కోరర్‌గా ఉన్న దూబే పేస్ బౌలింగ్ చేయగలరు. అయితే.. అతడిని ఇంపాక్ట్ ప్లేయర్‌ కింద పంపిస్తూ కేవలం బ్యాటింగ్‌‌కే పరిమితం చేస్తున్నారు. దీంతో ఆల్‌రౌండర్ల కోటాలో T20WC ఆడే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని క్రీడావిశ్లేషకులు చెబుతున్నారు.

Similar News

News November 27, 2025

దక్షిణామూర్తి చిత్రపటాన్ని ఇంట్లో ఏ రోజున ప్రతిష్ఠించాలి?

image

దక్షిణామూర్తి చిత్రపటాన్నిగురువారం రోజున ఇంట్లో ప్రతిష్ఠిస్తే సకల శుభాలు కలుగుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. గురు గ్రహ ప్రభావం అధికంగా ఉండే ఈరోజున జ్ఞాన స్వరూపుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే విద్యాభివృద్ధి పెరుగుతుందని అంటున్నారు. ‘శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం, పండుగ రోజులలో విగ్రహ స్థాపన చేయవచ్చు. నిష్ణాతులైన పండితుల సలహా మేరకు ప్రతిష్ఠించడం మరింత శ్రేయస్కరం’ అని చెబుతున్నారు.

News November 27, 2025

అమరావతిలో వేంకటేశ్వర ఆలయ విస్తరణ.. నేడు సీఎం భూమిపూజ

image

AP: అమరావతి కృష్ణానది తీరంలో శ్రీవేంకటేశ్వర ఆలయ విస్తరణ, అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం 2 దశల్లో ₹260Cr వెచ్చించనుంది. ఈ పనులకు CM CBN ఇవాళ భూమి పూజ చేయనున్నారు. దాదాపు 3వేల మంది భక్తులు పాల్గొని వీక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాకారం, ఏడంతస్తుల రాజగోపురం, సేవా మండపం, రథ మండపం, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం, పుష్కరిణి, విశ్రాంతి భవనం తదితర పనులు పూర్తిచేస్తారు.

News November 27, 2025

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి రక్షణ ఇలా..

image

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుశనగ పొలం చుట్టూ 4 వరుసల్లో కుసుమ పంట వేస్తే ఆ మొక్క ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. కుసుమ మొక్క వాసన ఘాటుగా ఉండడం వల్ల వేరుశనగ పంట వైపు పందులు రావు. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లు గల ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవచ్చు.