News June 3, 2024
T20 WC: టీ20ల్లో శ్రీలంకకు అత్యల్ప స్కోర్

టీ20 వరల్డ్కప్లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచులో శ్రీలంక 77 రన్స్కే కుప్పకూలింది. ఆ జట్టు బ్యాటర్లలో కుశాల్ మెండిస్ (19) టాప్ స్కోరర్గా నిలిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోకియా 4, కేశవ్ మహరాజ్ 2, రబాడ 2 వికెట్లు తీయగా, బార్ట్మన్ ఒక వికెట్ పడగొట్టారు. టీ20ల్లో శ్రీలంకకు ఇదే అత్యల్ప స్కోర్.
Similar News
News October 8, 2025
కనకాంబరంలో ఎండు తెగులు నివారణ ఎలా?

కనకాంబరంలో ఎండు తెగులు ముఖ్యమైన సమస్య. ఈ తెగులు ఆశించిన కనకాంబరం మొక్క ఆకులు వాలిపోయి, ఆకు అంచు పసుపు రంగుకు మారుతుంది. వేర్లు, కాండం, మొదలు కుళ్లడం వల్ల మొక్క అకస్మాత్తుగా ఎండిపోతుంది. దీంతో మొక్కలు గుంపులుగా చనిపోతాయి. ఎండు తెగులు నివారణకు తెగులు ఆశించిన మొక్కల మొదళ్లు తడిచేలా.. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. కలిపి.. ఒక్కో మొక్కకు 20-25 మిల్లీ లీటర్ల ద్రావణాన్ని పోయాలి.
News October 8, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. బీజేపీ టికెట్ ఎవరికి?

TG: జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ను BJP ఎవరికి కేటాయిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. పోటీ చేసేందుకు దీపక్ రెడ్డి, వీరపనేని పద్మ, కీర్తిరెడ్డి, మాధవీలత, ఆకుల విజయ, అట్లూరి రామకృష్ణ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురి పేర్లను రాష్ట్ర కమిటీ జాతీయ నాయకత్వానికి పంపనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10న పార్టీ నేతలు మరోసారి సమావేశమై అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది.
News October 8, 2025
ప్రతి శనివారం టిడ్కో ఇళ్ల కేటాయింపు: మంత్రి

AP: 2026 జూన్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను ప్రతి శనివారం లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. రాబోయే రెండేళ్లలో అమృత్ 2.0 స్కీమ్లో భాగంగా పట్టణాల్లో 90 శాతం ఇళ్లకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు. గడువులోగా సంబంధిత తాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలని సూచించారు.