News June 29, 2024
T20 WC: ఫస్ట్ బ్యాటింగ్ చేసే జట్టుదే విజయం?

T20WC ఫైనల్ మ్యాచ్ బార్బోడస్లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో నేడు జరగనుంది. T20 చరిత్రలో ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 50మ్యాచులు జరగగా, 31మ్యాచుల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ల యావరేజ్ 138, సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ల సగటు 125గా ఉంది. అత్యధిక స్కోరు 224/5, అత్యల్ప స్కోరు 43గా నమోదైంది. ఛేదించిన అత్యధిక స్కోర్ 172/6 కాగా, డిఫెండ్ చేసుకున్న లోయెస్ట్ స్కోర్ 106/8గా ఉంది.
Similar News
News December 19, 2025
బుల్లెట్ రైలు కోసం అనంతపురం జిల్లాలో భూ పరీక్షలు

హైదరాబాద్-బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు మార్గం ఏర్పాటులో భాగంగా అనంతపురం జిల్లాలో మట్టి పరీక్షలు నిర్వహించారు. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిపుణుల బృందం అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం మండలాల్లోని 40 ప్రాంతాల్లో నమూనాలు సేకరించింది. ఈ గ్రౌండ్ లెవల్ రిపోర్టు ఆధారంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు ముందుకు సాగనున్నాయి. రవాణా రంగంలో ఇది సరికొత్త విప్లవానికి నాంది కానుంది.
News December 19, 2025
AIIMS బిలాస్పుర్లో ఉద్యోగాలు

AIIMS బిలాస్పుర్ 68 జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 21 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, BDS ఉత్తీర్ణతతో పాటు సెంట్రల్/స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. జీతం నెలకు రూ.56,100+అలవెన్సులు చెల్లిస్తారు. డిసెంబర్ 23న రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.aiimsbilaspur.edu.in
News December 19, 2025
MLAల ఫిరాయింపు: నేడు సుప్రీంలో విచారణ

తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. కోర్టు గడువు నేపథ్యంలో ఐదుగురికి క్లీన్ చిట్ ఇస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం వెల్లడించారు. కడియం, దానం నాగేందర్ ఇంకా వివరణ ఇవ్వలేదు. తమ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరారని ఆరోపిస్తున్న తరుణంలో స్పీకర్ అనూహ్య నిర్ణయంతో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.


