News June 29, 2024
T20 WC: ఫస్ట్ బ్యాటింగ్ చేసే జట్టుదే విజయం?

T20WC ఫైనల్ మ్యాచ్ బార్బోడస్లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో నేడు జరగనుంది. T20 చరిత్రలో ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 50మ్యాచులు జరగగా, 31మ్యాచుల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ల యావరేజ్ 138, సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ల సగటు 125గా ఉంది. అత్యధిక స్కోరు 224/5, అత్యల్ప స్కోరు 43గా నమోదైంది. ఛేదించిన అత్యధిక స్కోర్ 172/6 కాగా, డిఫెండ్ చేసుకున్న లోయెస్ట్ స్కోర్ 106/8గా ఉంది.
Similar News
News December 12, 2025
హీరోయిన్పై గ్యాంగ్ రేప్.. ఆరుగురికి 20 ఏళ్ల జైలు

మలయాళ హీరోయిన్పై గ్యాంగ్ రేప్ <<18502408>>కేసులో<<>> ఆరుగురు నిందితులకు కేరళ ఎర్నాకుళం స్పెషల్ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో కొన్నాళ్లు జైలు జీవితం గడిపిన నటుడు దిలీప్ను ఇటీవలే న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది. మిగతా నిందితులైన సునీల్, మార్టిన్ ఆంటోనీ, మణికందన్, విజీశ్, సలీమ్, ప్రదీప్కు ఇవాళ శిక్ష ఖరారు చేసింది. 2017లో హీరోయిన్పై గ్యాంగ్రేప్ దేశవ్యాప్తంగా సంచలనమైంది.
News December 12, 2025
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అమరావతి బిల్లు!

అమరావతి రాజధాని చట్టబద్ధత అంశం శుక్రవారం కేంద్ర క్యాబినెట్లో చర్చకు రాలేదు. AP నుంచి మరింత సమాచారం తీసుకుని క్యాబినెట్లో ఆమోదించి అనంతరం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. కాగా సాంకేతిక సమస్యల పరిష్కారంపై AP కసరత్తు చేపట్టింది. 2014-2024 వరకు అమరావతినే రాజధానిగా గుర్తించేలా అది అధ్యయనం చేస్తోంది. ఫ్యూచర్లో రాజధానిని మార్చకుండా ఒకే క్యాపిటల్ ఉండేలా చర్య తీసుకుంటోంది.
News December 12, 2025
మరోసారి అన్నా హజారే నిరాహార దీక్ష

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహార దీక్ష చేయనున్నారు. మహారాష్ట్రలో లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఈ దీక్ష చేపట్టనున్నారు. జనవరి 30నుంచి ఆయన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో దీక్ష ప్రారంభిస్తానని ప్రకటించారు. 2022లో దీక్ష చేసినప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ లోకాయుక్త బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే చట్టం క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదని ఆయన ఆరోపిస్తున్నారు.


