News March 21, 2024
T20 WC: వికెట్ కీపర్గా ఛాన్స్ దక్కేదెవరికి?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710997971992-normal-WIFI.webp)
జూన్లో జరిగే T20 WCలో వికెట్ కీపర్గా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై BCCI దృష్టి సారించింది. ఈ స్థానం కోసం KL రాహుల్, పంత్, జురెల్, శాంసన్, జితేశ్ పోటీ పడుతున్నారు. ఫిట్నెస్తో పాటు ఫామ్లో ఉన్నవారిని తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నారట. పంత్ వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. కానీ అతను తన ఫామ్ను నిరూపించుకోవాల్సి ఉంది. IPLలో ప్రదర్శన ఆధారంగానే WK ఎంపిక ఉండనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News July 8, 2024
ఆర్మీ వాహనంపై టెర్రరిస్టుల దాడి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720436749069-normal-WIFI.webp)
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కథువాలో ఆర్మీ వాహనంపై దాడి చేశారు. కొండ పైనుంచి వెహికల్పై కాల్పులు జరిపి, గ్రెనేడ్స్ వేయడంతో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిన్న కుల్గాంలో సైన్యం, టెర్రరిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. ఆరుగురు ముష్కరులు చనిపోయారు. కాగా ఇటీవల జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
News July 8, 2024
మట్టి వినాయకులను పూజించండి: పవన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720358078093-normal-WIFI.webp)
AP: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయకచవితికి మట్టి గణపతులనే పూజించాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ సూచించారు. ‘మట్టి గణపతులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రయోగాత్మకంగా పిఠాపురంలో మట్టి వినాయకులను పూజించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయాల్లో ప్రసాదాలను బటర్ పేపర్తో కాకుండా చిన్నపాటి తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడాలి’ అని తనను కలిసిన పర్యావరణ ప్రేమికుడు విజయ రామ్తో పవన్ వ్యాఖ్యానించారు.
News July 8, 2024
ఏపీ టెట్ షెడ్యూల్లో మార్పులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32023/1679908557526-normal-WIFI.webp)
AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) షెడ్యూల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. జులై 2న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ జరగాల్సి ఉండగా, ఆ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని తెలిపింది. ప్రిపరేషన్కు సమయం కోసం అభ్యర్థుల వినతి మేరకు సవరణ నోటిఫికేషన్ను ఇవాళ రిలీజ్ చేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.