News April 29, 2024
T20 ప్రపంచకప్.. టీమ్ ఇండియా ఇదేనా?

టీ20 WC కోసం టీమ్ ఇండియా ఎంపికపై బీసీసీఐ కసరత్తు చేస్తోంది. అయితే కింద పేర్కొన్న 15 మంది జట్టులో ఉంటారని espncricinfo తెలిపింది.
టీమ్: రోహిత్ (C), జైస్వాల్, విరాట్, సూర్య, సంజూ శాంసన్, పంత్, హార్దిక్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్/సిరాజ్.
**కేఎల్ రాహుల్, చాహల్, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ కూడా రేసులో ఉన్నట్లు పేర్కొంది.
Similar News
News September 17, 2025
ECILలో 160 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు

TG: HYDలోని ప్రభుత్వరంగ సంస్థ ECIL 160 కాంట్రాక్ట్ బేస్డ్ టెక్నికల్ ఆఫీసర్-C ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. BE/B.Tech విభాగాల్లో 60% మార్కులు, ఏడాది అనుభవం, 30 ఏళ్లలోపు వాళ్లు అర్హులు. జీతం తొలి ఏడాదిలో నెలకు రూ.25 వేలు, రెండో ఏడాది రూ.28 వేలు, 3, నాలుగో ఏడాది రూ.31 వేల చొప్పున ఇస్తారు. ఈనెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం https://ecil.co.in/ వెబ్సైట్ను సంప్రదించండి.
News September 17, 2025
రోజూ గంట నడిస్తే.. ఇన్ని లాభాలా?

నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. రోజులో గంటసేపు నడిస్తే శరీరంలో జరిగే మార్పుల గురించి వివరించారు. *రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. *ఒత్తిడి తగ్గుతుంది. *మానసిక స్థితి మెరుగవుతుంది.
*రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలోకి వస్తాయి. *పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. *మనసు ప్రశాంతంగా ఉంటుంది. *డోపమైన్ (హ్యాపీ హార్మోన్) పెరుగుతుంది. అందుకే నడవడం మొదలుపెట్టండి. SHARE IT
News September 17, 2025
తెలంగాణ విమోచన వేడుకల్లో రాజ్ నాథ్ సింగ్

TG: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై.. జాతీయ జెండాను ఎగుర వేస్తారు. ఆయన నిన్న సాయంత్రమే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. గతేడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.