News July 8, 2024
T20WC: ఒక్కో క్రికెటర్కు ₹5కోట్లు
టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు BCCI ₹125కోట్లు నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని పంచగా 15మంది ఆటగాళ్లు, కోచ్ ద్రవిడ్కి ఒక్కొక్కరికి ₹5కోట్లు రానున్నాయి. మిగిలిన కోచ్లు ₹2.5కోట్ల చొప్పున అందుకుంటారు. బ్యాక్రూమ్ స్టాఫ్ తలా ₹2కోట్లు, సెలెక్షన్ కమిటీలోని సభ్యులు, రిజర్వ్ ప్లేయర్లు ₹కోటి చొప్పున అందుకుంటారు. వాంఖడేలో ఇప్పటికే దీనికి సంబంధించిన చెక్కును BCCI జట్టుకు అందించింది.
Similar News
News October 6, 2024
దసరా సెలవులు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి
దసరా సెలవులు ప్రారంభమవడంతో ఇంటి వద్ద ఉంటున్న పిల్లలపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది. నిన్న APలోని ఎమ్మిగనూరులో ఈతకు వెళ్లి ఒకరు, బహిర్భూమికి వెళ్లి నీటి కుంటలో పడి ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారు. అలాగే ఫ్రెండ్స్తో ఆడుకుంటూ కూల్డ్రింక్ అనుకుని పురుగు మందు తాగి ఓ విద్యార్థి మరణించాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా తోటి పిల్లలతో కలిసి వాళ్లు ఏంచేస్తున్నారు? ఎక్కడికెళ్తున్నారు? అనేది పేరెంట్స్ గమనించాలి.
News October 6, 2024
రూ.20,000 సాయం కోసం మత్స్యకారుల ఎదురుచూపులు
AP: ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధం కొనసాగుతుంది. ఈ సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు ఇవ్వాల్సిన జీవన భృతి ఇప్పటికీ అందలేదు. త్వరగా చెల్లించి ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతుండగా, సంక్రాంతికి ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం రూ.10వేల చొప్పున లక్ష మందికి చెల్లించేది. రూ.20వేలు అందిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది.
News October 6, 2024
రికార్డుల గురించి ఆలోచించను: రూట్
జట్టు విజయానికి సహకరించడమే తనను ముందుకు నడిపిస్తుందని ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ అన్నారు. వ్యక్తిగతంగా ఆటను ఆస్వాదిస్తానని, తానెప్పుడూ రికార్డుల గురించి ఆలోచించనని పేర్కొన్నారు. తాను క్రికెట్ ఆడుతున్నంత వరకు టెస్టుల్లో ఇంగ్లండ్కు ప్రాతినిధ్యం వహిస్తానని తెలిపారు. కాగా, టెస్టుల్లో రూట్ మరో 71 రన్స్ చేస్తే అలిస్టర్ కుక్ (12,472)ను అధిగమించి అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లండ్ ఆటగాడిగా నిలుస్తారు.